News April 25, 2024
విశాఖ: ఆర్పీలు తొలగింపు.. సీఓలపై సస్పెన్షన్
ఓటర్ల వివరాలను రాజకీయ పార్టీలకు అందజేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న ఐదుగురు డ్వాక్రా రిసోర్స్ పర్సన్స్ను తొలగిస్తూ విశాఖ జిల్లా కలెక్టర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు మరో ఇద్దరు కమ్యూనిటీ ఆర్గనైజర్లను, ఒక సోషల్ వర్కర్ ను సస్పెండ్ చేశారు. ఆర్పీలు ఓటర్ల ఎపిక్ నెంబర్లు, ఆధార్ కార్డులు, సెల్ ఫోన్ నెంబర్లు సేకరించారన్న ఫిర్యాదుపై విచారణకు ఆదేశించారు. నివేదిక ఆధారంగా వారిపై చర్యలు తీసుకున్నారు.
Similar News
News January 21, 2025
ఎదురుకాల్పుల్లో కీలక నేతలు మృతి?
ఛత్తీస్ఘడ్-ఒడిశా సరిహద్దుల్లో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి, ఒడిశా మావోయిస్టు పార్టీ ఇన్ఛార్జ్ మొండెం బాలకృష్ణ మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. అధికారికంగా వివరాలు ఇంకా తెలియాల్సి ఉండగా ఇంకా గాలింపు చర్యలు జరుగుతుండగా,మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటివరకు 14 మృతదేహాలు లభ్యమయ్యాయి.
News January 21, 2025
పరవాడ ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం
పరవాడ ఫార్మాసిటీలో మంగళవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. మెట్రో కెమ్ కంపెనీలో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News January 21, 2025
స్టీల్ ప్లాంట్: విద్యుత్ షాక్తో కార్మికుడి దుర్మరణం
స్టీల్ ప్లాంట్ రైల్వే లైన్లో విద్యుత్ షాక్తో కాంట్రాక్టు కార్మికుడు సోమవారం మృతి చెందాడు. ఇస్లాం పేటకు చెందిన మహమ్మద్ గౌస్ (26) స్టీల్ ప్లాంట్లో రైల్వేకు చెందిన సురభి ఎంటర్ప్రైజెస్లో పనిచేస్తున్నాడు. ట్యాంకర్పై ఉన్న విద్యుత్ లైన్లు తాకడం వల్ల షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. స్టీల్ ప్లాంట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.