News September 20, 2024
విశాఖ: ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ‘మోకా’కు చోటు

మిల్లెట్ ఆర్టిస్ట్ మోకా విజయ్ కుమార్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించారు. విశాఖకు చెందిన విజయ్ కుమార్ చిరుధాన్యాలతో చిత్రాలను, బొమ్మలను తయారుచేస్తూ గుర్తింపు పొందారు. ఇటీవల మిల్లెట్స్తో తయారు చేసిన సీఎం చంద్రబాబు చిత్రపటాన్ని అమరావతిలో అయనకు బహూకరించారు. వివిధ చోట్ల జరిగిన జీ- 20 సదస్సులో ఆయన తయారుచేసిన మిల్లెట్ చిత్రాలు ప్రదర్శించారు.
Similar News
News October 29, 2025
జీవీఎంసీ సిటీ ఆపరేషన్ సెంటర్ను సందర్శించిన కలెక్టర్

జీవీఎంసీ సిటీ ఆపరేషన్ సెంటర్ను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సందర్శించారు. సిటీ ఆపరేషన్ సెంటర్ ద్వారా తుఫాను కారణంగా తీసుకుంటున్న జాగ్రత్తలను కమిషనర్ కేతన్ గార్గ్ను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు ఇస్తున్నామని వివరించారు. అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు.
News October 28, 2025
రేపు కూడా ఆంధ్ర విశ్వవిద్యాలయానికి సెలవు

ఆంధ్ర విశ్వవిద్యాలయానికి బుధవారం కూడా సెలవు ప్రకటిస్తూ ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థులకు 2 రోజులుగా తరగతులను రద్దు చేసిన సంగతి తెలిసిందే. తుఫాను నేపథ్యంలో ఉద్యోగులకు, సిబ్బందికి సైతం మంగళవారం సెలవు ప్రకటించారు. విశాఖ జిల్లాలో పాఠశాలలకు, కళాశాలలకు రేపు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఏయూ అధికారులు కూడా సెలవు ప్రకటించారు.
News October 28, 2025
మరింత అప్రమత్తంగా ఉందాం: ప్రత్యేక అధికారి

మొంథా తుపాను మంగళవారం రాత్రి 10 నుంచి సుమారు 12 గంటల మధ్య తీరం దాటే అవకాశం ఉందని ప్రత్యేక అధికారి అజయ్ జైన్ వెల్లడించారు. మంగళవారం సాయంత్రం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులు చేపట్టే ముందస్తు జాగ్రత్తలు సత్ఫలితాలను ఇస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కలెక్టర్ హరేంధిర ప్రసాద్, ఎంపీ శ్రీభరత్, తదితరులు పాల్గొన్నారు.


