News April 2, 2024
విశాఖ ఎంపీగా ఇదే అత్యధిక మెజారిటీ

విశాఖ లోక్సభ స్థానం 1952లో ఏర్పడింది. ఉప ఎన్నికలతో కలిపి మొత్తం 18 సార్లు ఎన్నికలు జరిగాయి. 1952 ఎన్నికల్లో ద్విసభ విధానంతో ఇద్దరు ఇండిపెండెంట్లు గెలుపోందారు. 1984 ఎన్నికల్లో TDP నుంచి భాట్టం శ్రీరామమూర్తి అత్యధిక మెజారిటీ 1,40,431 నమోదుకాగా, 2019లో YCP నుంచి MVV సత్యనారాయణ అత్యల్ప మెజారిటీ 4,414 నమోదయ్యింది. మరి ఈసారి ఎన్నికల్లో ఎవరు ఎంత మెజారిటీతో గెలుస్తారని భావిస్తున్నారో కామెంట్ చేయండి.
Similar News
News October 15, 2025
610 క్లాప్ వాహనాల ద్వారా చెత్త సేకరణ: జీవీఎంసీ సీఎంవో

ఇళ్ల నుంచి చెత్త సేకరణకు ప్రజలు సహకరించాలని జీవీఎంసీ సీఎంవో నరేష్ కుమార్ కోరారు. పారిశుద్ధ్య కార్మికుల ద్వారా ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరిస్తున్నామన్నారు. దీన్ని 100% నిర్వహించేందుకు చర్యలు చేపట్టామన్నారు. 610 క్లాప్ వాహనాలు, 65 ఇ-ఆటోల ద్వారా చెత్తను సేకరిస్తున్నామని తెలిపారు. నగర ప్రజలు తడి, పొడి, ప్రమాదకర వ్యర్థాలను వేరుచేసి పారిశుద్ధ్య కార్మికులకు అందించాలన్నారు.
News October 15, 2025
నిర్ధిష్ట సమయంలో రోడ్ల నిర్మాణం: వీఎంఆర్డీఏ ఛైర్మన్

మాస్టర్ ప్లాన్ రహదారులను నిర్ధిష్ట సమయంలో పూర్తి చేయాలని వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ ఆదేశించారు. అర్హులైన వారికి టీడీఆర్ ఇవ్వాలన్నారు. సమస్యలు లేని చోట్ల రహదారుల నిర్మాణాన్ని ప్రారంభించాలన్నారు. అటవీ శాఖ నుంచి అనుమతులు తీసుకోవాలన్నారు. భోగాపురం విమానాశ్రయాన్ని అనుసంధానించే <<18005420>>రోడ్డు నిర్మాణం<<>> వేగవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కమిషనర్ రమేశ్, సీఈ వినయ్ కుమార్ పాల్గొన్నారు.
News October 15, 2025
ఈనెల 17న కంచరపాలెంలో జాబ్ మేళా

కంచరపాలెం ఉపాధి కల్పనా కార్యాలయంలో అక్టోబర్ 17న జాబ్ మేళా నిర్వహించనున్నారు. 10వ తరగతి, ఇంటర్, ఐటిఐ, డిగ్రీ చదివిన వారు అర్హులు.ఈ జాబ్ మేళాలో మొత్తం 8కంపెనీలు పాల్గొనున్నాయి. అభ్యర్థులు తమ వివరాలను https://employment.ap.gov.in and https://www.ncs.gov.inలో రిజిస్టర్ అవ్వాలి. ఆరోజు ఉదయం 10గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నారు.