News March 11, 2025
విశాఖ ఎదగడానికి పోర్టే కారణం: సీఐటీయూ

విశాఖ అభివృద్ధిలో పోర్టు కీలకపాత్ర పోషిందని సీఐటీయూ నాయకులు అన్నారు. ఒకప్పుడు చిన్న గ్రామంగా ఉండే విశాఖ ఈరోజు మహానగరంగా ఆవిర్భవించడానికి పోర్టే కారణమన్నారు. ఈ సంవత్సరం రూ.800 కోట్లు, గతేడాది రూ.386 కోట్లు లాభాలతో నడుస్తుందని వెల్లడించారు. నేటికి కూడా రూ.171.42కోట్లు వివిధ పన్నుల రూపంలో ప్రభుత్వం ఆర్జిస్తుండగా.. పోర్ట్ హాస్పిటల్ను అమ్మడం దారుణమన్నారు. ఈమేరకు రిలే నిరాహార దీక్షలో వారు మాట్లాడారు.
Similar News
News November 21, 2025
విశాఖ: యాంటీ బయోటిక్స్ వాడుతున్నారా?

విశాఖ DMHO కార్యాలయం వద్ద శుక్రవారం యాంటీ మైక్రోబియల్ రెసిస్టన్స్ ర్యాలీ నిర్వహించారు. DMHO జగదీశ్వరరావు జెండా ఊపి ప్రారంభించారు. యాంటీ బయోటిక్స్ను అనవసరంగా వాడటం వలన డ్రగ్ రెసిస్టన్స్ పెరుగుతుందన్నారు. డాక్టర్స్ సలహాల మేరకే యాంటీ బయోటిక్స్ వాడాలన్నారు. డాక్టర్స్ సలహా లేకుండా యాంటీ బయోటిక్స్ను వాడితే ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు. హెల్త్ సిబ్బంది ప్రజలకు ఈ విషయాన్ని తెలియచేయాలన్నారు.
News November 21, 2025
ఉద్దానం కిడ్నీ వ్యాధులపై పరిశోధన ప్రారంభం

శ్రీకాకుళం జిల్లాలోని తీరప్రాంత మండలాల్లో కిడ్నీ వ్యాధులపై సమగ్ర అధ్యయనం ప్రారంభించామని కిడ్నీ వ్యాధుల పరిశోధన ప్రాజెక్టు మెంటర్ డా.టి.రవిరాజు అన్నారు. ఉద్దానం ప్రాంతంలో 18% జనాభా కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నట్లు తమ పరిశోధనలో వెల్లడైందన్నారు. ఈ ప్రాజెక్టుకు రూ.6.01కోట్లు ఖర్చు అవుతుందని అంచానా వేశారు. ఇచ్చాపురం, కంచిలి, పలాస, కవిటి, మందస, వజ్రపు కొత్తరు ప్రాంతాల్లో పరిశోధన చేస్తున్నామన్నారు.
News November 21, 2025
విశాఖ: ‘దళారులకు గంటా వార్నింగ్’

తర్లువాడ గూగుల్ డేటా సెంటర్ భూములకు శనివారం నుంచి పరిహారం రైతుల ఖాతాల్లో జమ అవుతుందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. ఎకరాకు రూ.20 లక్షలు, 20 సెంట్ల భూమి ఇస్తున్నట్లు తెలిపారు. ఎక్కువ ధర ఇప్పిస్తామని రైతులను మోసం చేస్తున్న దళారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను ఆదేశించారు. న్యాయమైన రైతుల కోరికలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.


