News February 20, 2025
విశాఖ: ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహణపై కలెక్టర్ సమీక్షా

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహణ, ఇతర ఏర్పాట్లపై విశాఖ కలెక్టర్ కార్యాలయంలో గురువారం జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సమీక్షా నిర్వహించారు. ఎన్నికల నిర్వహణ, పోలింగ్ ఏజెంట్లు, ఎన్నికల విధులు సన్నద్ధతపై ఉత్తరాంధ్ర జిల్లాల ఏఆర్వోలకు సూచనలు చేశారు. ఎన్నికలకు సంబంధించిన విధుల నిర్వహణలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
Similar News
News December 7, 2025
గాజువాక: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

గాజువాకలోని ఓ ఇంట్లో వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పీ.లక్ష్మి (65) మానసిక వికలాంగుడైన తన చిన్న కుమారుడితో కలిసి ఉంటోంది. రెండో కుమారుడు నాగేశ్వరరావు తల్లిని చూసేందుకు శనివారం ఇంటికి వెళ్లగా.. లక్ష్మి విగతజీవిగా పడి ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. గాజువాక ఎస్ఐ సూర్యకళ ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. మృతదేహం కుళ్లిపోయి ఉండడంతో చనిపోయి 3-4 రోజులు అయి ఉంటుందన్నారు.
News December 7, 2025
LRS, BPS GVMC టౌన్ ప్లానింగ్ విభాగంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు

LRS, BPS సంబంధిత సేవలకు GVMC టౌన్ ప్లానింగ్ విభాగంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్టు GVMC చీఫ్ సిటీ ప్లానర్ ఎ.ప్రభాకరరావు శనివారం తెలిపారు. BPS ద్వారా అనుమతి లేని, డీవియేషన్ ఉన్న భవనాలకు రెగ్యులరైజేషన్ దరఖాస్తుల ప్రక్రియను 2026 జనవరి 23 వరకు పొడిగించామన్నారు. ప్రజలకు మార్గదర్శకత్వం కోసం హెల్ప్ డెస్క్ నంబర్లు 91542 82649, 91542 82654 అందుబాటులో ఉన్నాయన్నారు.
News December 7, 2025
విశాఖపట్నం-SMVT బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు

ప్రయాణికుల సౌకర్యార్థం ECO రైల్వే అధికారులు విశాఖ-SMVT బెంగళూరు మధ్య ప్రత్యేక రైలును నడపనున్నట్లు తెలిపారు. విశాఖ–SMVT బెంగళూరు స్పెషల్ విశాఖ నుంచి డిసెంబర్ 8న మధ్యాహ్నం 3:20 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.45కు బెంగళూరు చేరుకుంటుందన్నారు. తిరుగుప్రయాణంలో బెంగళూరు నుంచి డిసెంబర్ 9న మధ్యాహ్నం 3:50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1:30కి విశాఖ చేరుతుందన్నారు.


