News May 15, 2024
విశాఖ: ఓటర్ల కోసం రైలుకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు
పోలింగ్ రోజున నాందేడ్-విశాఖ ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న పలువురు ఓటర్లు రైలు ఆలస్యంగా నడుస్తోందని, తాము ఓటు వేసే అవకాశం కోల్పోతామని సామాజిక మాధ్యమాలలో వీడియోలు పోస్ట్ చేశారు. వీటిని చూసిన రాష్ట్ర చీఫ్ ఎలక్షన్ కమిషనర్ స్పందించారు. సాయంత్రం 6 గంటలలోగా విశాఖ చేరాలని రైల్వే అధికారులకు సూచించగా.. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి నేరుగా 5:15 గంటలకు రైలును విశాఖకు పంపారు.
Similar News
News September 30, 2024
AU: అక్టోబర్ 1న బి.ఆర్క్ స్పెషల్ ఎగ్జామినేషన్
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అయిదవ సంవత్సరం రెండవ సెమిస్టర్ స్పెషల్ ఎగ్జామినేషన్ అక్టోబర్ 1వ తేదీన నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ రిజిస్టర్ ఎగ్జామినేషన్స్ జె.రత్నం తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి 5 గంటల వరకు ఈ పరీక్ష జరుగుతుందన్నారు. 2019- 20 నుంచి ప్రవేశం పొందిన విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులని వివరించారు.
News September 30, 2024
హుకుంపేట: ‘2 రోజులు మా గ్రామానికి రావొద్దు’
హుకుంపేట మండలంలో వైరల్ జ్వరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో మండలంలోని దాలిగుమ్మడి గ్రామస్థులు ముందు జాగ్రత్త చర్యలకు దిగారు. సోమ, మంగళవారం బయటి వ్యక్తులెవరూ గ్రామంలోకి రావొద్దని బారికేడ్ ఏర్పాటు చేశారు. గ్రామానికి వైరల్ జ్వరాలు, ఇతర జబ్బులు రాకుండా ఉండేందుకు అ 2రోజులు పాటు అమ్మోరు పండుగ జరుపుకుంటామని వారు తెలిపారు. బుధవారం ఉదయం నుంచి బయటి వ్యక్తులను అనుమతిస్తామన్నారు.
News September 30, 2024
విశాఖ నుంచి ప్రత్యేక రైళ్లు
వాల్తేరు డివిజన్ నుంచి దసరా, దీపావళి పండగల నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. విశాఖ నుంచి తిరుపతి, బెంగళూరు, సికింద్రాబాద్, చెన్నై, అరకు, కొల్లాం తదితర ప్రాంతాలకు సుమారు 30 రైళ్లు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు, ఇప్పటికే ఉన్న పలు రైళ్లకు స్లీపర్, జనరల్ బోగీలను కలపనున్నారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వీటిని ఏర్పాటు చేశామని, వినియోగించుకోవాలని అధికారులు కోరారు.