News September 30, 2024

విశాఖ: ‘ఓటుహక్కు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలి’

image

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు అర్హులైన ఉపాధ్యాయులందరూ ఓటు హక్కు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని విశాఖ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. సోమవారం నోటిఫికేషన్ వెలువడిందన్నారు. ఓటు నమోదు ప్రక్రియ కూడా ప్రారంభమైందని నవంబర్ 6 వరకు కొనసాగుతుందన్నారు. నవంబర్ 23న డ్రాఫ్ట్ పబ్లిష్ అవుతుందన్నారు. 23 నుంచి డిసెంబర్ 9 వరకు అభ్యంతరాల స్వీకరణ, 30న తుది జాబితా ప్రకటిస్తామన్నారు. >Share it

Similar News

News January 7, 2026

విశాఖ: సంక్రాంతికి ఊరు వెళ్తున్నారా?

image

విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాలతో నగరంలో నేరాలపై అవగాహన సదస్సులు నిర్వహించారు. సైబర్ నేరాలు, దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఊరు వెళ్లేటప్పుడు LHMS సేవలు వాడాలని, ఇళ్లకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. వాకింగ్‌కు వెళ్లే మహిళలు ఆభరణాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, పనివారి వివరాలు సేకరించాలని, వాహనాలకు విధిగా తాళాలు వేయాలని స్పష్టం చేశారు.

News January 7, 2026

జీవీఎంసీ అడిషనల్ కమిషనర్‌గా నల్లనయ్య

image

జీవీఎంసీ అడిషనల్ కమిషనర్‌గా పి. నల్లనయ్య‌ను నియమిస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా పనిచేస్తున్న నల్లనయ్య పదోన్నతిపై బదిలీ కాగా జీవీఎంసీలో అదనపు కమిషనర్‌గా పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

News January 7, 2026

జీవీఎంసీ అడిషనల్ కమిషనర్‌గా నల్లనయ్య

image

జీవీఎంసీ అడిషనల్ కమిషనర్‌గా పి. నల్లనయ్య‌ను నియమిస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా పనిచేస్తున్న నల్లనయ్య పదోన్నతిపై బదిలీ కాగా జీవీఎంసీలో అదనపు కమిషనర్‌గా పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.