News September 30, 2024
విశాఖ: ‘ఓటుహక్కు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలి’

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు అర్హులైన ఉపాధ్యాయులందరూ ఓటు హక్కు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని విశాఖ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. సోమవారం నోటిఫికేషన్ వెలువడిందన్నారు. ఓటు నమోదు ప్రక్రియ కూడా ప్రారంభమైందని నవంబర్ 6 వరకు కొనసాగుతుందన్నారు. నవంబర్ 23న డ్రాఫ్ట్ పబ్లిష్ అవుతుందన్నారు. 23 నుంచి డిసెంబర్ 9 వరకు అభ్యంతరాల స్వీకరణ, 30న తుది జాబితా ప్రకటిస్తామన్నారు. >Share it
Similar News
News December 3, 2025
BREAKING విశాఖ: స్పా సెంటర్పై దాడి.. ఐదుగురు అరెస్ట్

గాజువాక 80 ఫీట్ల రోడ్డులోని ఓ స్పా సెంటర్ పై సిటీ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఒక విటుడు, ఆర్గనైజరు, మేనేజర్, ఇద్దరు మహిళలను సిటీ టాస్క్ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిని గాజువాక పోలీసులకు అప్పగించి కేసు నమోదు చేశారు. అసాంఘిక కార్యకలాపాలు ఎక్కడ జరిగినా సమాచారం ఇవ్వాలని టాస్క్ఫోర్స్ సీఐ అప్పలనాయుడు ప్రజలను కోరారు.
News December 3, 2025
అట్రాసిటీ కేసుల పరిష్కారంలో చొరవ చూపాలి: కలెక్టర్

SC, ST అట్రాసిటీ కేసుల పరిష్కారంలో అధికారులు, పోలీసులు ప్రత్యేక చొరవ చూపాలని, పబ్లిక్ ప్రాసిక్యూటర్ల సాయం తీసుకొని త్వరగా ఫలితాలు వచ్చేలా చేయాలని కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ సూచించారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ మీటింగు హాలులో బుధవారం ఆయన సమీక్షించారు. అధికారులు ప్రజా సమస్యల పరిష్కారంలో చొరవచూపాలన్నారు.
News December 3, 2025
అట్రాసిటీ కేసుల పరిష్కారంలో చొరవ చూపాలి: కలెక్టర్

SC, ST అట్రాసిటీ కేసుల పరిష్కారంలో అధికారులు, పోలీసులు ప్రత్యేక చొరవ చూపాలని, పబ్లిక్ ప్రాసిక్యూటర్ల సాయం తీసుకొని త్వరగా ఫలితాలు వచ్చేలా చేయాలని కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ సూచించారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ మీటింగు హాలులో బుధవారం ఆయన సమీక్షించారు. అధికారులు ప్రజా సమస్యల పరిష్కారంలో చొరవచూపాలన్నారు.


