News January 31, 2025
విశాఖ: కన్న కొడుకే హత్య చేశాడు

విశాఖలో శుక్రవారం తెల్లవారుజామున రక్తపు మడుగులో పడి ఉన్న మహిళ మృతదేహం లభ్యమైన సంగతి తెలిసిందే. <<15316841>>ఆల్కాసింగ్<<>> భర్త బదిలీ కావడంతో ఇటీవలే ముంబై నుంచి విశాఖ వచ్చారు. పెద్ద కొడుకు ఆన్లైన్ గేమ్స్కు అలవాటు పడి చదువును నిర్లక్ష్యం చేస్తున్నాడని మందలించింది. దీంతో తల్లిని తీవ్రంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మల్కాపురం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Similar News
News December 13, 2025
ఇండియాకు కోహ్లీ.. మెస్సీని కలవడానికేనా?

స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇండియాకు చేరుకున్నారు. తన భార్య అనుష్క శర్మతో కలిసి ముంబై ఎయిర్పోర్టులో కనిపించారు. ‘గోట్ టూర్’లో భాగంగా భారత్లో ఉన్న మెస్సీని కోహ్లీ కలుస్తారని ప్రచారం జరుగుతోంది. రేపు ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఫ్యాన్స్ను మెస్సీ కలవనున్నారు. ఈ సమయంలోనే ఇద్దరు దిగ్గజాలు మీట్ అవుతారని అభిమానులు భావిస్తున్నారు. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ తర్వాత కోహ్లీ <<18500552>>లండన్<<>>కు వెళ్లడం తెలిసిందే.
News December 13, 2025
పంచాయతీ ఎన్నికలకు 1500 మంది పోలీసు భద్రత

రెండో విడత పంచాయతీ ఎన్నికలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు భద్రాద్రి ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. 1500 మంది పోలీసులతో భద్రతా ఉంటుందని, 1392 పోలింగ్ కేంద్రాల్లో సాధారణ 878, సమస్యాత్మక 179, అతి సమస్యాత్మక 285, మావోయిస్టు ప్రభావిత కేంద్రాలు 50 గుర్తించామన్నారు. ప్రజలందరూ నిర్భయంగా ఓటు వినియోగించుకోవాలని సూచించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విధులు నిర్వహించాలన్నారు.
News December 13, 2025
దేశంలో రోడ్డు లింక్ లేని గ్రామాలు 40547: కేంద్రం

స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్లవుతున్నా దేశంలో ఇంకా 40547 గ్రామాలకు రోడ్డు సదుపాయం లేదు. ఈ జాబితాలో MPలో 9246, గుజరాత్లో 2443, ఛత్తీస్గఢ్లో 2692, J&Kలో 2262, ఝార్ఖండ్ 2787, కేరళ 2335, WBలో 2748 గ్రామాలున్నాయి. APలో 413, TGలో 173 గ్రామాలకు రోడ్ల లింకేజ్ లేదని కేంద్రం వెల్లడించింది. PMGSY కింద 2029 నాటికి వీటికి రోడ్ల కనెక్టివిటీ చేపడతామని పేర్కొంది. పార్లమెంటులో ఓ సభ్యుడి ప్రశ్నకు సమాధానం ఇచ్చింది.


