News April 11, 2025

విశాఖ-కిరండూల్ పాసింజర్ అరకు వరకే

image

విశాఖ-కిరండూల్-విశాఖ పాసింజర్ అరకు వరకే నడుస్తాయని వాల్తేర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. కేకే లైన్‌లోని పాడువ – దార్లిపుట్ మధ్య డబ్లింగ్ పనులు జరుగుతున్న నేపథ్యంలో‌ విశాఖ-కిరండూల్ పాసింజర్ (58501) రైలు ఏప్రిల్ 14 నుంచి 22 వరకు విశాఖ నుంచి అరకు వరకే నడుస్తుందని తెలిపారు. తిరుగు ప్రయాణం కిరండూల్-విశాఖ పాసింజర్ (58502) రైలు ఈ నెల 14 నుంచి 22 వరకు అరకు నుంచి విశాఖ వెళ్తుందన్నారు.

Similar News

News November 18, 2025

మంత్రి సత్యకుమార్ పేరుతో ఫేక్ TTD లెటర్లు!

image

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ పేరుతో నకిలీ TTD లెటర్లు జారీకావడం కలకలం రేపుతోంది. ఈ మేరకు మంత్రి సత్యకుమార్ కార్యాలయానికి ఫిర్యాదు వచ్చింది. కొన్నిరోజులుగా మంత్రి పేరుతో నకిలీ లెటర్లు ఉపయోగిస్తున్నట్లు సమాచారం అందిందని ఆయన సిబ్బంది పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడతామన్నారు.

News November 18, 2025

మంత్రి సత్యకుమార్ పేరుతో ఫేక్ TTD లెటర్లు!

image

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ పేరుతో నకిలీ TTD లెటర్లు జారీకావడం కలకలం రేపుతోంది. ఈ మేరకు మంత్రి సత్యకుమార్ కార్యాలయానికి ఫిర్యాదు వచ్చింది. కొన్నిరోజులుగా మంత్రి పేరుతో నకిలీ లెటర్లు ఉపయోగిస్తున్నట్లు సమాచారం అందిందని ఆయన సిబ్బంది పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడతామన్నారు.

News November 18, 2025

ప్రకాశం: మనవడిపై ఫిర్యాదు చేసిన అవ్వ.!

image

ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం నాగంపల్లికి చెందిన 80ఏళ్ల వృద్ధురాలు సోమవారం SP హర్షవర్ధన్ రాజుకు ఫిర్యాదు చేసింది. మనవడు తనను పలుమార్లు కొట్టాడని వృద్ధురాలు ఆరోపించింది. కోడలు తీసుకున్న డబ్బులు ఇవ్వడంలేదని కూడా ఫిర్యాదు చేసింది. SP హర్షవర్ధన్ రాజు వృద్ధురాలితో ఆప్యాయంగా మాట్లాడి విషయాన్ని తెలుసుకున్నారు. అనంతరం ఆయన విచారణకు ఆదేశించారు.