News September 28, 2024
విశాఖ- కిరండూల్ రైళ్లు దంతెవాడ వరకు కుదింపు
విశాఖ- కిరండూల్ మధ్య నడుస్తున్న రైళ్లు వర్షాల కారణంగా ఈ నెల 28 నుంచి వచ్చే నెల 5 వరకు దంతెవాడకు కుదించినట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కే.సందీప్ శుక్రవారం తెలిపారు. ఈ రైళ్లు విశాఖ నుంచి దంతెవాడ తిరుగు ప్రయాణంలో దంతెవాడ నుంచి విశాఖకు చేరుకుంటాయని తెలిపారు. ప్రయాణికులు గమనించాలని కోరారు.
Similar News
News October 10, 2024
గుంటూరు-రాయగడ ఎక్స్ప్రెస్కు అదనపు బోగీలు
దసరా పండగ రోజుల్లో ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పలు రైళ్లకు అదనపు బోగీలు జత చేయనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం కే.సందీప్ తెలిపారు. ఇందులో భాగంగా ఈనెల 10 నుంచి 16 వరకు గుంటూరు-రాయగడ(17243), ఈనెల 11 నుంచి 17 వరకు రాయగడ-గుంటూరు (17244) రైళ్లకు రెండు సాధారణ, రెండు స్లీపర్ బోగీలు జత చేయనున్నామన్నారు. ప్రయాణికులు గమనించాలని కోరారు. >Share It
News October 10, 2024
రతన్ టాటా మరణం దేశానికి తీరని లోటు: మంత్రి
రతన్ టాటా మరణం పారిశ్రామిక రంగానికి, దేశానికి తీరని లోటు అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆయన మృతి పట్ల గురువారం మంత్రి సంతాపం వ్యక్తం చేశారు. దేశం గొప్ప మానవతావాది కోల్పోయిందని, ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం ఆయన నైజమని కొనియాడారు. పుట్టు కోటీశ్వరుడైనా, అంతర్జాతీయ స్థాయి పారిశ్రామిక దిగ్గజంగా ఎదిగినా, సామాన్య జీవనం సాగించిన మహోన్నత వ్యక్తి రతన్ టాటా అని పేర్కొన్నారు.
News October 10, 2024
పైడితల్లి జాతర ఏర్పాట్లపై మంత్రి సమీక్ష
విజయనగర ఉత్సవాలు ప్రతి ఒక్కరి మదిలో మధుర స్మృతిగా నిలిచిపోయేలా నిర్వహించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఏర్పాట్లను చూసి అధికారులతో మాట్లాడిన తర్వాత ఉత్సవాలు ఘన విజయం అవుతాయనే నమ్మకం కలిగిందని అన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి బుధవారం సమీక్షించారు. ఉత్సవాలు విజయవంతం చేయాలని సూచించారు.