News June 5, 2024

విశాఖ: కుటుంబంలో ముగ్గురూ ఓటమి

image

వార్డు మెంబర్ నుంచి ఉపముఖ్యమంత్రి అయిన బూడికి ఈ ఎన్నికల్లో పరాభవం తప్పలేదు. అనకాపల్లి MPగా పోటీ చేసి.. సీఎం రమేశ్ చేతిలో 2,96,630 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అనూహ్యంగా వైసీపీ తరఫున మాడుగుల MLA బరిలో దిగిన అతని కుమార్తె ఈర్లె అనూరాధకు కూడా ఓటమి తప్పలేదు. TDP అభ్యర్థి బండారు 28,026 ఓట్ల మెజార్టీతో ఆమెపై గెలిచారు. మాడుగుల నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన అతని కుమారుడికి 395 ఓట్లు మాత్రమే వచ్చాయి.  

Similar News

News November 16, 2025

వైసీపీ నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు: ప్రణవ్

image

సీఐఐ భాగస్వామ్య సదస్సు విజయవంతం కావటంతో వైసీపీ నేతలకు మింగుడు పడటం లేదని వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ అన్నారు. ఫ్యూచర్ రెడీ ఇన్నోవేషన్ రాష్ట్రంగా ఏపీని సీఎం చంద్రబాబు తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. పెద్దఎత్తున ఒప్పందాలు జరగటంతో వైసీపీ నేతలు భయపడి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కోడిగుడ్డు మంత్రిగా పేరొందిన అమర్ నాథ్ ఉన్న ఐదేళ్లలో ఒక్క పరిశ్రమ కూడా రాలేదన్నారు.

News November 16, 2025

ఉత్పత్తి సామర్థ్యం ఆధారంగా జీతం చెల్లింపుపై RINL సర్క్యులర్

image

విశాఖ స్టీల్ ప్లాంట్, RINL సర్క్యులర్ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం, ఉద్యోగుల జీతం ఇకపై సాధించిన ఉత్పత్తి లక్ష్యాల శాతానికి అనుగుణంగా చెల్లించబడుతుంది. గతంలో లక్ష్యాలు చేరుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 8 గంటల పాటు విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులకు, సంస్థ నిబంధనల ప్రకారం పూర్తి జీతం ఇవ్వాలని కార్మిక సంఘాలు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ నూతన విధానం అమలుపై ప్లాంట్‌లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

News November 16, 2025

విశాఖ: ప్రభుత్వ కార్యాలయాలలో రేపు పీజీఆర్ఎస్

image

విశాఖ కలెక్టరేట్‌లో ఈనెల 17న ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. అదేవిధంగా సీపీ, జీవీఎంసీ ప్రధాన, జోనల్ కార్యాలయాల్లో కూడా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వినతులు స్వీకరిస్తారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.