News July 6, 2024

విశాఖ: గోదావరి టైటాన్స్ విజయం

image

విశాఖ వైయస్సార్ క్రికెట్ స్టేడియంలో ఏపీఎల్ సీజన్-3లో గోదావరి టైటాన్స్ బెజవాడ టైగర్స్ జట్లు శనివారం తలపడ్డాయి. ఒక్క పరుగు తేడాతో గోదావరి టైటాన్స్ విజయం సాధించింది. టాస్ గెలిచి బెజవాడ టైగర్స్ బౌలింగ్ ఎంచుకుంది. గోదావరి టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 225 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బెజవాడ టైగర్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి ‌224 పరుగులు చేసి ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. 

Similar News

News December 4, 2025

విశాఖ: క్రికెటర్ ‌కరుణ కుమారికి ఘన సత్కారం

image

అంధుల మహిళా టీ20 వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన విశాఖ బాలికల అంధుల రెసిడెన్షియల్ విద్యార్థిని కరుణ కుమారిని క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్ ఘనంగా సత్కరించారు. ప్రపంచ కప్‌కు సెలెక్ట్ అయిన తరువాత ప్రాక్టీస్‌కు అనుగుణంగా క‌రుణ‌కుమారికి ప్ర‌త్యేకంగా రెండు క్రికెట్ కిట్లకు రూ.50వేలు ఇవ్వడం జరిగిందన్నారు. భారత జట్టు విజయంలో కీలక ప్రతిభ చూపిన ఆమెకు ప్రోత్సాహకంగా క‌లెక్ట‌ర్ రూ.లక్ష చెక్ అందజేశారు

News December 4, 2025

మహిళలకు అత్యంత సురక్షితమైన నగరంగా విశాఖ: హోం మంత్రి

image

మహిళలకు అత్యంత సురక్షితమైన నగరంగా విశాఖకు గుర్తింపు పొందిన సందర్భంగా బీచ్‌ రోడ్డులో ర్యాలీ నిర్వహించారు. హోం మంత్రి అనిత పాల్గొని ర్యాలీ ప్రారంభించారు. మహళల భద్రతే ఎన్డీయే ప్రభుత్వం లక్ష్యమని, సంఘటన జరిగిన వెంటనే శిక్షలు పడుతున్నాయన్నారు. శక్తి టీమ్స్, యాప్ ద్వారా మహిళలకు రక్షణ కల్పిస్తున్నామన్నారు. విశాఖకు జాతీయ స్థాయిలో ప్రఖ్యాతలు తీసుకువచ్చిన పోలీసులను మంత్రి అనిత అభినందించారు.

News December 4, 2025

6న విశాఖ రానున్న గవర్నర్ అబ్దుల్ నజీర్

image

ఈ నెల 6,7వ తేదీలలో గవర్నర్ అబ్దుల్ నజీర్ విశాఖ రానున్నారు. ఆరోజున ఉదయం 8 గంటలకు విశాఖ ఎయిర్ పోర్ట్‌కు చేరుకొని అక్కడ నుండి నోవాటెల్ కు చేరుకుంటారు. మధ్యామ్నం 12.45 గంటలకు మధురవాడలోని ACA-VDCA క్రికెట్ స్టేడియంకు వెళ్లి మ్యాచ్ వీక్షిస్తారు. రాత్రి 10గంటలకు స్టేడియం నుంచి నోవాటెల్ హోటల్‌కు చేరుకుని రాత్రి బస చేస్తారు. 7వ తేదీ మధ్యాహ్నం 1.45కు ఎయిర్ పోర్ట్‌కు చేరుకుని విజయవాడ తిరిగి వెళ్తారు