News April 2, 2024

విశాఖ: గోవులతో ఉన్న కంటైనర్ సీజ్

image

నక్కపల్లి మండలం వేంపాడు హైవే టోల్ ప్లాజా వద్ద అక్రమంగా గోవులను తరలిస్తున్న కంటైనర్‌ను పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. ఒడిశా నుంచి హైదరాబాద్ సమీపంలో కబేళాకు గోవులను తరలిస్తున్నారన్న సమాచారం మేరకు డీఎస్పీ మోహన్, నక్కపల్లి సీఐ విజయ్ కుమార్ సిబ్బందితో తనిఖీలు చేపట్టారు. దీంతో ఒక కంటైనర్ తనిఖీ చేయగా.. అందులో 65 గోవులున్నట్టు గుర్తించారు. ఈ మేరకు కంటైనర్‌ను సీజ్ చేసి కేసు నమోదు చేశారు.

Similar News

News April 18, 2025

గంటాను కలిసిన దేవీశ్రీ ప్రసాద్

image

భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ శుక్రవారం ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. పోర్టు స్టేడియంలో శనివారం రాత్రి జరగనున్న సంగీత విభావరి కోసం దేవీశ్రీ ప్రసాద్ విశాఖ వచ్చారు. సినీ సంగీత కార్యక్రమాలను నగర ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తారని, ఈ విభావరి కూడా విజయవంతం కావాలని గంటా ఆకాంక్షించారు. తన కొత్త ప్రాజెక్టుల వివరాలను దేవీశ్రీ ప్రసాద్ గంటాతో పంచుకున్నారు. 

News April 18, 2025

విశాఖలో దేవిశ్రీప్రసాద్ మ్యూజికల్ నైట్‌.. పోలీసుల సూచనలు

image

విశాఖ పోర్ట్ స్టేడియంలో శనివారం నిర్వహించే దేవిశ్రీప్రసాద్ మ్యూజికల్ నైట్‌కు వచ్చే వారికి పోలీసులు శుక్రవారం పలు సూచనలు చేశారు. వీఐపీ టికెట్లు ఉన్నవారికి మాత్రమే ప్రధాన గేటు ద్వారా ఎంట్రీ ఉంటుందన్నారు. వారి వాహనాలకు లోపల పార్కింగ్ చేసుకోవాలన్నారు. సాధారణ టికెట్లు ఉన్నవారికి పోర్ట్ స్టేడియం వెనుక గేటు నుంచి ప్రవేశం ఉంటుందన్నారు. వారి వాహనాలు నిర్దేశించిన ప్రదేశంలో పార్కింగ్ చేయాలన్నారు.

News April 18, 2025

అవిశ్వాసం: విశాఖలో జనసేన నేతల సమావేశం

image

జీవీఎంసీ మేయర్‌పై శనివారం అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో విశాఖలోని ఓ హోటల్‌లో జనసేన ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు, కార్పొరేటర్లు శుక్రవారం సమావేశం అయ్యారు. రేపు అవిశ్వాసంలో చేపట్టవలసిన తీరుపై ఎమ్మెల్యే వంశీకృష్ణ దిశానిద్దేశం చేశారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అవిశ్వాసంలో వ్యవహరించాలన్నారు. మేయర్‌పై అవిశ్వాసంలో కూటమి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 

error: Content is protected !!