News December 12, 2024

విశాఖ: జగ్దల్ పూర్- కిరండూల్ రైల్వే లైన్ తనిఖీ

image

వాల్తేరు రైల్వే డివిజన్ పరిధిలో జగ్దల్ పూర్-కిరండూల్ రైల్వే లైన్ ను ఈస్ట్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ పరమేశ్వర్ పంక్వాల్ గురువారం తనిఖీ చేశారు. రైల్వే శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పలు సూచనలు సలహాలు ఇచ్చారు. ట్రాక్ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వాల్తేరు రైల్వే డిఆర్ఎం మనోజ్ కుమార్ సాహు పాల్గొన్నారు.

Similar News

News January 25, 2025

విశాఖ: పురుగు మందు తాగి తల్లీ కూతురు మృతి

image

తగరపువలస ఆదర్శనగర్లో ‌విషాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. భార్యాభర్తల గొడవతో మనస్తాపం చెందిన వివాహిత శనివారం మాధవి (25)ఇద్దరు కుమార్తెలతో పాటు పురుగు మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. తల్లితో పాటు చిన్న కుమార్తె రతిక్ష మృతి చెందింది. మృతిరాలి భర్త రామకృష్ణ ప్రైవేట్ పరిశ్రమలో ఉద్యోగం చేస్తున్నాడు. వీరి స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగంమని పోలీసులు దర్యాప్తు చేస్తున్నామన్నారు.

News January 25, 2025

భీమిలి: ‘విజ‌య‌సాయి రెడ్డి చ‌ట్టం నుంచి త‌ప్పించుకోలేరు’

image

విజ‌య‌సాయి రాజీనామా చేసి బ‌య‌ట‌కు వెళ్లినా చ‌ట్టం నుంచి త‌ప్పించుకోలేరని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రావు అన్నారు. శనివారం ఆయన తన నివాసాల విలేకరులతో మాట్లాడారు. విజయసాయి హ‌యాంలో విశాఖ‌ వాసులు ప‌డిన ఇబ్బందుల‌ను మ‌ర్చిపోలేమ‌న్నారు. వైసీపీ మునిగిపోయే నావని తాను ఎప్పుడో చెప్పాన‌ని వ్యాఖ్యని గుర్తుచేస్తూ ఇప్పుడు అది నిజమవుతోందన్నారు. స్టీల్ ప్లాంట్ ప్యాకేజీపై ఇప్పటికీ వక్రంగా మాట్లాడుతున్నారన్నారు.

News January 25, 2025

భీమిలి: కుమార్తె వీడియోలు చూపించి తల్లిని బ్లాక్ మెయిల్

image

భీమిలిలో ఫొక్సో కేసు నమోదైనట్లు సమాచారం. గాజువాకకు చెందిన వ్యక్తి భీమిలి మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించి, ఆ వీడియోతో బాలిక తల్లిని బ్లాక్ మెయిల్ చేసినట్లు సమాచారం. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.