News April 15, 2025
విశాఖ జడ్పీ సమావేశానికి హాజరు కావాలి: ఛైర్పర్సన్

విశాఖ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం బుధవారం ఉదయం 10.30 గంటలకు జడ్పీ ఛైర్పర్సన్ జె.సుభద్ర అధ్యక్షతన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరగనుంది. జిల్లా అభివృద్ధి ఎజెండాపై కీలక చర్చలు జరగనున్నాయి. జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించే ఈ సమావేశానికి గౌరవ సభ్యులు, ఆహ్వానితులు హాజరు కావాల్సిందిగా జడ్పీ ఛైర్పర్సన్ సుభద్ర మంగళవారం కోరారు.
Similar News
News April 19, 2025
సమిష్టి కృషితో విజయం సాధించాం: గంటా

కూటమి ప్రభుత్వంలో ప్రతీ ఒక్కరి సమిష్టి కృషితోనే విజయం సాధించామని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు శనివారం మేయర్పై అవిశ్వాస తీర్మానం నెగ్గిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైసీపీపై పూర్తి వ్యతిరేకతతోనే కూటమిలో ఆ పార్టీ కార్పొరేటర్లు చేరారని అన్నారు. జీవీఎంసీకి మంచి రోజులు రానున్నాయని తెలిపారు. గత ప్రభుత్వంలో జీవీఎంసీలో అభివృద్ధి కుంటిపడిందన్నారు.
News April 19, 2025
ఆ 27మందిపై అనర్హత వేటు వేయండి: వైసీపీ

జీవీఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్ హరేంద్ర ప్రసాద్ను వైసీపీ నేత తైనాల విజయ్ కుమార్ కలిశారు. విప్ ధిక్కరించిన 27 మంది కార్పొరేటర్లపై ఫిర్యాదు చేశారు. జీవీఎంసీ కాన్ఫిడెన్స్ ఇన్ మేయర్ రూల్స్-2008 ప్రకారం వైసీపీ గుర్తుపై గెలిచి కూటమికి మద్దతు ఇవ్వడం ప్రొసీడింగ్స్ ప్రకారం తప్పని.. 27మంది కార్పొరేటర్లపై అనర్హత వేటు వేయాలని కోరారు. విప్ కాపీని అందజేశారు.
News April 19, 2025
విశాఖ అభివృద్ధే సీఎం లక్ష్యం: మంత్రి డోలా

వైసీపీ 5 ఏళ్ల పాలనలో జీవీఎంసీలో జరిగిన అభివృద్ధి శూన్యమని విశాఖ జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి స్వామి అన్నారు. శనివారం ఆయన జీవీఎంసీలో మేయర్పై అవిశ్వాసం నెగ్గిన సందర్భంగా కూటమి కార్పొరేటర్లతో కలిసి మాట్లాడారు. వైసీపీ అరాచకాలు అడ్డుకునేందుకే కార్పొరేటర్లు తిరుగుబాటు చేశారని పేర్కొన్నారు. విశాఖను అన్ని విధాల అభివృద్ధి చేయాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యం అన్నారు.