News September 16, 2024
విశాఖ: జిల్లాకు అదనంగా 150 నుంచి 200 రేషన్ డిపోలు

విశాఖ జిల్లాలో రేషన్ డిపోల సంఖ్య 150 నుంచి 200 వరకు పెరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా రాష్ట్రం దుకాణాల ఏర్పాటుకు ప్రభుత్వం ఆదివారం నోటిఫికేషన్ జారీ చేసింది. జిల్లాలో 642 రేషన్ డిపోల పరిధిలో 5.29 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. రేషన్ కార్డుల సంఖ్య పెరుగుతూ వస్తున్నా డిపోలు మాత్రం పెరగలేదు. ఈనెల 30 నుంచి పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు.
Similar News
News January 11, 2026
విశాఖ పోలీసులను అభినందించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా

విశాఖలో మహిళపై దాడి కేసులో స్పష్టమైన ఆధారాలు లేకున్నా పోలీసులు కేసు ఛేదించారని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. ఈ ఘటనలో పోలీసులు స్పందించిన తీరు, వేగవంతమైన దర్యాప్తు అభినందనీయమని ఆయన కొనియాడారు. కూటమి పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయనేందుకు ఇదే నిదర్శనమన్నారు. మహిళల రక్షణలో దేశంలోనే విశాఖకు మొదటి స్థానం కూటమి ఘనతే అన్నారు.
News January 11, 2026
విశాఖ జూ పార్క్లో ముగిసిన వింటర్ క్యాంప్

విశాఖ జూ పార్క్లో 4 రోజుల నుంచి జరుగుతున్న వింటర్ క్యాంప్ ఆదివారంతో ముగిసింది. జనవరి 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఈ క్యాంప్ నిర్వహించిన్నట్లు క్యూరేటర్ మంగమ్మ తెలిపారు. వింటర్ క్యాంప్తో వన్యప్రాణుల ప్రపంచాన్ని పిల్లలకు పరిచయం చేశారు. ముఖ్యంగా జూ పార్కులో వెటర్నరీ హాస్పిటల్, జంతువుల నివాసాలు, వాటి ఆహారపు అలవాట్లు, వాటి ప్రత్యేక లక్షణాలపై అవగాహన కల్పించారు.
News January 11, 2026
సైబర్ క్రైమ్ ముఠా ఉచ్చు నుంచి బయటపడ్డ ఉత్తరాంధ్ర యువకులు

ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాలకు చెందిన 27 మంది యువకులు మయన్మార్లో సైబర్ క్రైమ్ ముఠాకు చిక్కుకొని నరకయాతన పడ్డారు. యువకులు ఈ విషయాన్ని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన స్పందించి విదేశాంగ శాఖ మంత్రితో మాట్లాడి తిరిగి మన దేశానికి తీసుకొచ్చారు. ఆదివారం విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్న యువకులు మంత్రికి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.


