News December 16, 2024
విశాఖ జిల్లాలో దివ్యాంగులకు ఉపకరణాల గుర్తింపు శిబిరాలు ఇవే..
దివ్యాంగులు, వయోవృద్ధుల సహాయ ఉపకరణాల గుర్తింపు శిబిరాలను ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సోమవారం తెలిపారు. దివ్యాంగులకు ఉచితంగా ఉపకరణాలు అందించేందుకు ఈ నెల 19న భీమిలి రెడ్డిపల్లి జెడ్పీ హై స్కూల్ ఆవరణలో, 20న విశాఖ నీలమ్మ వేపచెట్టు వద్ద ఉన్న ఎం.జి.ఎం హైస్కూల్లో, 21న విశాఖ వెస్ట్ పరిధిలో క్వీన్ మేరీ హైస్కూల్ వద్ద ఈ శిబిరాలు నిర్వహిస్తామన్నారు.
Similar News
News February 5, 2025
రాయగడ డివిజన్ పరిధిలో రైల్వే లైన్లు ఇవే..
రాయగడ డివిజన్ పరిధిలో <<15366937>>రైల్వే లైన్లు<<>> రైల్వే శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజీవ్ కుమార్ వెల్లడించారు. బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
➤ కొత్తవలస- బచేలి/ కిరండోల్
➤ కూనేరు-తెరువలి జంక్షన్
➤ సింగ్ పూర్ రోడ్-కొరాపుట్ జంక్షన్
➤ పర్లాకిముండి- -గుణపూర్ రైల్వేస్టేషన్ను రాయగడ రైల్వే డివిజన్ పరిధిలోకి చేర్చారు.
News February 5, 2025
KGHలో రౌడీషీటర్ హల్చల్
విశాఖ కేజీహెచ్లో రౌడీషీటర్ బుధవారం హల్చల్ చేశాడు. ఆస్పత్రిలో పనిచేసే రౌడీషీటర్ రాజును విధుల నుంచి తప్పించారు. దీంతో రాజు పిల్లల వార్డుకు ఆక్సిజన్ వెళ్లే పైప్లైన్ను కట్ చేసే ప్రయత్నం చేశాడు. అడ్డుకున్న సెక్యూరిటీ గార్డ్ను కత్తితో బెదిరించాడు. మరో ఇద్దరు రాజుకు సహకరించగా ఆసుపత్రి వర్గాల ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ముగ్గురినీ అరెస్టు చేశారు.
News February 5, 2025
గాజువాకలో ఫార్మా ఉద్యోగి మృతి.. ఐదుగురు అరెస్ట్
గాజువాకలో ఫార్మసిటీ ఉద్యోగి భాస్కరరావు మృతి కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశామని గాజువాక సీఐ పార్థసారథి తెలిపారు. వీరు హింసించి, ఆత్మహత్యకు ప్రేరేపించడం వల్లే అతను మృతి చెందాడని ప్రాథమిక విచారణలో వెల్లడయ్యిందన్నారు. ఈ కేసులో ఏ-1 హేమంత నర్సింగ్ కుమార్(కూర్మన్నపాలెం), ఏ-2 ప్రియాంక(గాజువాక), ఏ-3 కర్రి లక్ష్మి(శ్రీనగర్), ఏ-4 హేమ శేఖర్, ఏ-5గా మణికంఠను రిమాండ్కు తరలించామన్నారు.