News March 16, 2025

విశాఖ జిల్లా పి.టి.ఐ.లు ప్రాంతీయ సదస్సు

image

సమగ్ర శిక్షాలో 2012 నుంచి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న పి.టి.ఐ.లను రెగ్యులరైజ్ చేయాలని విశాఖ పౌర గ్రంథాలయంలో ఆదివారం ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్రవ్యాప్తంగా 5,800 మంది, ఉమ్మడి విశాఖలో 460 మందికి పైగా ఈ విధుల్లో ఉన్నారన్నారు. తక్షణమే వారిని రెగ్యులరైజేషన్ చేసి, బోధనేతర పనుల భారం తగ్గించాలని,ఇ.ఎస్.ఐ., ఇ.పి.ఎఫ్ వర్తింపజేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

Similar News

News November 18, 2025

విశాఖ సీపీ కార్యాలయానికి 135 ఫిర్యాదులు

image

ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో భాగంగా పోలీస్ కమీషనరేట్‌‌కు సోమవారం 135 ఫిర్యాదులు వచ్చాయని కమిషనర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. ఫిర్యాదుదారులతో నేరుగా ఆయన మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్‌లో, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి చట్టపరంగా సమస్య పరిష్కారించాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్‌లో ఒకసారి నమోదైన ఫిర్యాదు పునరావృతం కాకుండా చూడాలన్నారు.

News November 18, 2025

విశాఖ సీపీ కార్యాలయానికి 135 ఫిర్యాదులు

image

ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో భాగంగా పోలీస్ కమీషనరేట్‌‌కు సోమవారం 135 ఫిర్యాదులు వచ్చాయని కమిషనర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. ఫిర్యాదుదారులతో నేరుగా ఆయన మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్‌లో, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి చట్టపరంగా సమస్య పరిష్కారించాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్‌లో ఒకసారి నమోదైన ఫిర్యాదు పునరావృతం కాకుండా చూడాలన్నారు.

News November 18, 2025

ఒక్క ప్రాజెక్టు తెచ్చినట్టు నిరూపించినా రాజీనామా చేస్తా: గంటా

image

వైసీపీ హయాంలో మొదలు పెట్టి, పూర్తి చేసి ప్రారంభించిన ఒక్క ప్రాజెక్టు చూపించినా తన పదవికి రాజీనామా చేస్తానని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సవాల్ చేశారు. ఎంవీపీ కాలనీ క్యాంపు కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తన అయిదేళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కియా వంటి చెప్పుకోదగ్గ ఒక్క కంపెనీని కూడా రాష్ట్రానికి తీసుకురాలేకపోయిందని మండిపడ్డారు.