News February 26, 2025
విశాఖ జూలో అబ్బుర పరుస్తున్న సెల్ఫీ పాయింట్స్

విశాఖ ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్లో ఏర్పాటుచేసిన సెల్ఫీ పాయింట్స్ సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. తెల్లటైగర్ ఎన్ క్లోజర్, జిరాఫీ ఎన్ క్లోజర్, బటర్ ఫ్లై పార్కుతో పాటు వివిధ ముఖ్యమైన ప్రదేశాల్లో వీటిని ఏర్పాట చేశారు. కలర్ ఫుల్గా వివిధ హంగులతో ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ల వద్ద సందర్శకులు, చిన్నపిల్లలు ఉత్సాహంగా సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు. పాయింట్లు మరిన్ని పెంచాలని కోరుతున్నారు.
Similar News
News February 27, 2025
తల్లి మందలించిందని బాలుడి సూసైడ్

కంచరపాలెం సమీపంలోని కేవీ స్కూల్లో 9వ తరగతిచదువుతున్న దాసరి ఎర్రినిబాబు తన ఇంట్లో మేడపై బాత్రూంలో నైలాన్ తాడుతూ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్కూల్ సెలవు కావడంతో ఉదయం నుంచి ఇంటికి రాకపోవడంతో తల్లి ఎర్రినిబాబును మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన బాలుడు సాయంత్రం మేడ మీదకు వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. కంచరపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News February 27, 2025
విశాఖ మహా కుంభాభిషేకంలో పాల్గొన్న బ్రహ్మానందం

విశాఖ ఆర్కే బీచ్లో మాజీ కేంద్ర మంత్రి సుబ్బిరామిరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం మహా కుంభాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటుడు బ్రహ్మానందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరూ హైందవ ధర్మంను కాపాడుకోవడాన్ని తమ భాద్యతగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతోపాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
News February 27, 2025
విశాఖ మీదుగా నడిచే పలు రైళ్లు రీ షెడ్యూల్

విశాఖ మీదుగా నడిచే పలు రైళ్లను నేడు రీషెడ్యూల్ చేసినట్లు అధికారులు తెలిపారు. బుధవారం రాత్రి 22:45 గంటలకు బయలుదేరాల్సిన హౌరా – SMV బెంగుళూరు SF ఎక్స్ప్రెస్ గురువారం తెల్లవారుజామున 2 గంటలకు హౌరాలో బయలుదేరనుంది. సికింద్రాబాద్ – విశాఖ గరీబ్ రథ్ ఎక్స్ ప్రెస్ ఈరోజు రాత్రి గంట ఆలస్యంగా 9.30 గంటలకు విశాఖలో బయలుదేరనుంది. ప్రయాణీకులు గమనించాలని కోరారు.