News December 11, 2024
విశాఖ: ‘జ్యూస్లో మత్తు మందు కలిపి ఇబ్బందులు పెట్టేది’
విశాఖ హనిట్రాప్ కేసులో బాధితుడి తల్లి మంగళవారం విశాఖలో ప్రెస్మీట్ పెట్టింది. తమ బిజినెస్ ప్రోమోట్ చేస్తానని జాయ్ జమియా తన కుమారిడితో పరిచయం పెంచుకుందని తెలిపింది. అమెరికా నుంచి అతనిని వైజాగ్కి రప్పించిన ఆమె.. జ్యూస్లో మత్తు మందు కలిపి పెట్టిన ఇబ్బందులను వాయిస్ మెసేజ్ ద్వారా తమకు తెలియజేశాడని పేర్కొంది. ఇంకా చాలామంది బాధితులు ఉన్నారని కేసును లోతుగా విచారించాలని పోలీసులను కోరింది.
Similar News
News January 13, 2025
విశాఖ: భోగి మంట వేస్తున్నారా?
సంక్రాంతి వేడుకలో మొదటి రోజు భోగి. తెల్లవారుజామున భోగి మంటలు వేయడంతో పండుగ సెలబ్రేషన్స్ మొదలవుతాయి. ఇంటింటా ఉత్సాహంగా భోగి మంటలు వేసుకుంటారు. మరి మీరూ నేడు భోగి మంట వేస్తున్నారా? మీసెలబ్రేషన్స్ను వే2న్యూస్లో చూడాలనుకుంటున్నారా? అయితే మీ భోగి మంటను వీడియో తీసి ఈ 73311 61607కు వాట్సాప్ చేయండి. మీ గ్రామం, మండలం పేర్లు తప్పక పంపండి. మేము పబ్లిష్ చేస్తాం
News January 12, 2025
రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు
విశాఖ నగర పోలీసు కాన్ఫరెన్స్ హాల్లో రేపు నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ డా.శంఖబ్రత బాగ్చి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం భోగీ పండుగ నేపథ్యంలో సెలవు దినం కావడంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం లేదన్నారు. విశాఖ నగర ప్రజలు, ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
News January 12, 2025
వైజాగ్లో ఒప్పో రెనో 13 సిరీస్ లాంఛ్
ఒప్పో రెనో 13 సిరీస్ మొబైల్ ఫోన్ను విశాఖ డాబా గార్డెన్స్ సెల్ పాయింట్ నందు నిర్వహించిన కార్యక్రమంలో సినీనటి డింపుల్ హయాతి మార్కెట్లోకి విడుదల చేశారు. చైర్మన్ మోహన్ ప్రసాద్ పాండే మాట్లాడుతూ.. సంక్రాతి సందర్బంగా ప్రత్యేక రాయితీలు, లక్కీ డ్రా అందుబాటులో ఉందని, సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సెల్ పాయింట్ డైరెక్టర్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.