News July 17, 2024
విశాఖ: డిగ్రీ ప్రవేశాల కౌన్సిలింగ్ షెడ్యూల్లో మార్పులు

ఏయూ పరిధిలో డిగ్రీ ప్రవేశాలకు సంబంధించిన కౌన్సిలింగ్ ప్రక్రియలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువు జులై 25వ తేదీ వరకు పొడిగించారు. స్పెషల్ కేటగిరి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జులై 23 నుంచి 25 వరకు జరుగుతాయి. కోర్సులు, కళాశాలల ఎంపికకు వెబ్ ఆప్షన్స్ నమోదు జులై 26 నుంచి 29 వరకు ఉంటుంది. వెబ్ ఆప్షన్ మార్చుకోవడానికి ఈనెల 30న అవకాశం ఇచ్చారు. ఆగష్టు 3న సీట్ల కేటాయింపు ఉంటుంది.
Similar News
News December 23, 2025
విశాఖలో రూ.27 కోట్ల జీఎస్టీ మోసం

విశాఖపట్నం డీజీజీఐ డిప్యూటీ డైరెక్టర్ శ్వేతా సురేష్ నేతృత్వంలో జరిగిన దర్యాప్తులో రూ.27.07 కోట్ల భారీ జీఎస్టీ మోసం వెలుగుచూసింది. ఎటువంటి వస్తు సరఫరా లేకుండా నకిలీ ఐటీసీని సృష్టించిన ఈ నెట్వర్క్ సూత్రధారి మల్లికార్జున మనోజ్ కుమార్ను అధికారులు అరెస్టు చేశారు. పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యల్లో భాగంగా విశాఖ జోనల్ యూనిట్ ఈ ఏడాది చేసిన నాలుగో అరెస్టు ఇది అని అధికార వర్గాలు తెలిపాయి.
News December 23, 2025
విశాఖ: రెండో మ్యాచ్లోనూ పైచేయి సాధిస్తారా?

విశాఖపట్నం వేదికగా శ్రీలంక మహిళలతో శనివారం జరిగిన తొలి టీ20 మ్యాచ్లో భారత మహిళల జట్టు ఘనవిజయం సాధించింది. బౌలర్ల అద్భుత ప్రదర్శన, ఆపై బ్యాటర్ల నిలకడైన ఆటతీరుతో భారత్ 8 వికెట్ల తేడాతో లంకను చిత్తు చేసింది. ఈ విజయం ద్వారా ఐదు మ్యాచ్ల సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇవాళ రెండో మ్యాచ్లో తలపడనుంది. ఈ మేరకు నిన్న నెట్స్లో టీం చెమటోడ్చారు.
News December 23, 2025
విశాఖ బీచ్ రోడ్లో పీసా రన్ ప్రారంభం

విశాఖలో మంగళవారం నుంచి పీసా మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం విశాఖ బీచ్ రోడ్లో గల కాళీమాత టెంపుల్ వద్ద PESA రన్ ప్రారంభించారు. క్రీడాకారిణి జ్యోతి సురేఖ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. IAS అధికారులు ముక్తా శేఖర్, శశిభూషణ్ కుమార్, కృష్ణ తేజ, ముత్యాల రాజు ఉన్నారు.


