News October 6, 2024
విశాఖ డెయిరీ అవినీతిపై సమగ్ర దర్యాప్తు చేయాలి: జనసేన కార్పొరేటర్

విశాఖ డెయిరీ అవినీతి బాగోతంపై సమగ్ర దర్యాప్తు చేయాలని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ఆదివారం మాట్లాడారు. ఉత్తరాంధ్రలో విశాఖ డెయిరీకి మూడు లక్షల మంది పాడి రైతులు దశాబ్దాలుగా పాలు పోస్తూన్నారని, రూ.200 కోట్ల టర్నోవర్ ఉన్న ఈ డెయిరీ చరిత్రలో ఇప్పుడు నష్టాల బాటలో ఉన్నా ఆడారి కుటుంబం మాత్రం లబ్ది పొందిందన్నారు. డెయిరీ ఆస్తులపై CBI విచారణ చేయాలన్నారు.
Similar News
News September 17, 2025
GVMC జోన్-3 పరిధిలో 26న బహిరంగ వేలం

GVMC జోన్- 3 పరిధిలో దుకాణాలు, కళ్యాణ మండపాలు, రోడ్ సైడ్ మార్కెట్లకు సెప్టెంబర్ 26న బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు జోనల్ కమిషనర్ కె.శివప్రసాద్ బుధవారం తెలిపారు. జోన్ పరిధిలోని షాపింగ్ కాంప్లెక్స్, కళ్యాణ మండపాలు, పలు వార్డుల్లో వ్యాపార సముదాయాలను వేలం వేస్తామన్నారు. ఆసక్తి ఉన్నవారు GVMC జోన్-3 జోనల్ ఆఫీసు వద్ద ఆరోజు ఉదయం 11 గంటలకు హాజరుకావాలన్నారు.
News September 17, 2025
విశాఖ: పిల్లల ఉచిత శిక్షణా కార్యక్రమాలు పునఃప్రారంభం

VMRDA బాలల ప్రాంగణంలో పిల్లల కార్యక్ర మాలు సెప్టెంబర్ 21 నుంచి ప్రతి ఆదివారం పునఃప్రారంభమవుతాయని ఛైర్మన్ ఎం.వి.ప్రణవ్ గోపాల్, కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్ బుధవారం వెల్లడించారు. విద్యార్థులకు ఇంగ్లీష్, పబ్లిక్ స్పీకింగ్, సంగీతం, డ్రాయింగ్, సైన్స్, కథా విన్యాసం, ఆర్ట్ & క్రాఫ్ట్, క్విజ్, AI కోడింగ్, కాలిగ్రఫీ, మ్యాథ్స్, నటన వర్క్షాప్, కెరీర్ గైడెన్స్ వంటి విభాగాలలో ఉచిత శిక్షణ అందిస్తారు.
News September 17, 2025
విశాఖలో పార్టనర్షిప్ సమ్మిట్-2025

నవంబర్ 14,15తేదీల్లో విశాఖలో ప్రతిష్టాత్మకంగా పార్టనర్షిప్ సమ్మిట్-2025 నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా లండన్లోని నారా లోకేశ్ గ్లోబల్ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పలికేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం-యుకె బిజినెస్ ఫోరం నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో దూసుకెళ్తున్నామని చెప్పారు. పలు దిగ్గజ కంపెనీల అధినేతలతో సమావేశం అయ్యారు.