News October 7, 2024
విశాఖ: ఢిల్లీలో జరిగిన సదస్సులో పాల్గొన్న హోంమంత్రి

ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో కేంద్ర హోం శాఖమంత్రి అమిత్ షా అధ్యక్షతన నిర్వహించిన సదస్సులో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత హాజరయ్యారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలకు నిర్వహించిన సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం తరపున అనిత పాల్గొన్నారు. మావోయిస్టుల కట్టడి, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి, కార్యచరణ ప్రణాళికపై ప్రధానంగా చర్చ జరిగినట్లు హోం మంత్రి తెలిపారు.
Similar News
News November 7, 2025
ఆనందపురం: అనుమానాస్పద స్థితిలో కార్పెంటర్ మృతి

ఆనందపురం మండలం నేలతేరు గ్రామానికి చెందిన కడియం కనకరాజు (53) గురువారం సాయంత్రం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కార్పెంటర్గా పనిచేస్తున్న అతను ఆనందపురం గ్రామంలోని కోళ్ల ఫారం షెడ్ నిర్మాణానికి వెళ్లగా అక్కడ మృతి చెందాడు. మొదట సహజ మరణంగా భావించిన కుటుంబ సభ్యులు తర్వాత అనుమానం వ్యక్తం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News November 7, 2025
విశాఖను డ్రగ్స్కు అడ్డగా మార్చారు: పట్టభి రామ్

విశాఖ డ్రగ్స్ కేసులో YCP విద్యార్థి నాయకుడు కొండా రెడ్డి అరెస్టుతో రాజకీయాలు వేడెక్కాయి. TDP నేత పట్టాభి రామ్ గురువారం మాట్లాడుతూ .. ‘YCP యువజన విభాగం డ్రగ్స్ ముఠాగా మారింది. జగన్ హయాంలో విశాఖను డ్రగ్స్కు అడ్డాగా మార్చారు’అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. ‘కొండా రెడ్డి అరెస్టు అక్రమం. ప్రభుత్వం కక్షతో YCP నేతలను టార్గెట్ చేస్తోంది’ అని ఆరోపించారు.
News November 7, 2025
విశాఖ: ప్రమాద బాధితులకు పరిహారం అందజేత

విశాఖ సీపీ కార్యాలయంలో రోడ్డు ప్రమాద బాధితుల సహాయక కేంద్రం ద్వారా గురువారం పరిహారం అందజేశారు. హిట్ అండ్ రన్ కేసులో గాయపడిన సీతమ్మధారకు చెందిన కనపర్తి వీరేందర్, గ్రీన్ గార్డెన్కు చెందిన జాగు సత్యనారాయణకు రూ.50వేలు చొప్పున వారి బ్యాంకు ఖాతాలో జమ చేశారు. ఇప్పటివరకు 90 మందికి రూ.72 లక్షల పరిహారం అందించినట్లు సీపీ శంఖబ్రత బాగ్చి వెల్లడించారు.


