News April 12, 2025
విశాఖ-తిరుపతి మధ్య వేసవి ప్రత్యేక రైలు

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అనకాపల్లి మీదుగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేరు డివిజన్ డీసీఎం సందీప్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. విశాఖ-తిరుపతి వీక్లీ ఎక్స్ప్రెస్ ప్రతి బుధవారం రాత్రి 7 గంటలకు విశాఖలో బయలుదేరుతుందన్నారు. తిరుపతి-విశాఖ స్పెషల్ రైలు ప్రతి గురువారం రాత్రి తిరుపతిలో బయలుదేరుతుందన్నారు. విశాఖ-కర్నూలు స్పెషల్ ప్రతి మంగళవారం రాత్రి 7 గంటలకు విశాఖలో బయలుదేరుతుందని పేర్కొన్నారు.
Similar News
News September 15, 2025
తెలంగాణ అప్డేట్స్

* సెప్టెంబర్ 17ను ‘తెలంగాణ విలీన దినోత్సవం’గా నిర్వహించాలని CM రేవంత్కు సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని లేఖ
* ఈ నెల 17 నుంచి అక్టోబర్ 16వరకు నిర్వహించే పోషణ మాసం మహోత్సవాన్ని విజయవంతం చేయాలని మంత్రి సీతక్క పిలుపు
* బీఈడీలో రెండో విడతలో 7,441 మందికి సీట్ల కేటాయింపు. ఇవాళ కాలేజీలో రిపోర్ట్ చేయాలని అధికారుల సూచన
* ఇవాళ్టి నుంచి నాగ్పూర్-సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు మంచిర్యాలలో హాల్టింగ్
News September 15, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లాలో వర్షపాతమిలా..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆదివారం 8 గంటల నుంచి సోమవారం ఉదయం వరకు వర్షపాతం నమోదు వివరాలు ఇలా ఉన్నాయి. కోనరావుపేటలో 85.0, ముస్తాబాద్ 71.3, సిరిసిల్ల 53, వేములవాడ రూరల్ 52.3, గంభీరావుపేట 49.3, ఎల్లారెడ్డిపేట 43.5, వేములవాడ 41.5, వీర్నపల్లి 11.0, ఇల్లంతకుంట 18.0, తంగళ్లపల్లి 3.3, చందుర్తిలో 8.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
News September 15, 2025
నక్కపల్లి: ధర్నా చేసిన పలువురిపై కేసులు నమోదు

నక్కపల్లి మండలం రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్క్కు వ్యతిరేకంగా ఆదివారం ధర్నాలో పాల్గొన్న 13 మంది మత్స్యకారులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.ఎ రిపల్లి నాగేశ్వరరావు, ఎం.మహేష్, ఎం.బైరాగి, జి.స్వామి, కె.కాశీరావు పి.రాము తదితరులపై పోలీసులు కేసులు పెట్టారు. ధర్నాకు అనుమతులు లేని కారణంగా కేసులు నమోదు చేసినట్లు సీఐ కుమారస్వామి తెలిపారు.