News April 12, 2025
విశాఖ-తిరుపతి మధ్య వేసవి ప్రత్యేక రైలు

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అనకాపల్లి మీదుగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేరు డివిజన్ డీసీఎం సందీప్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. విశాఖ-తిరుపతి వీక్లీ ఎక్స్ప్రెస్ ప్రతి బుధవారం రాత్రి 7 గంటలకు విశాఖలో బయలుదేరుతుందన్నారు. తిరుపతి-విశాఖ స్పెషల్ రైలు ప్రతి గురువారం రాత్రి తిరుపతిలో బయలుదేరుతుందన్నారు. విశాఖ-కర్నూలు స్పెషల్ ప్రతి మంగళవారం రాత్రి 7 గంటలకు విశాఖలో బయలుదేరుతుందని పేర్కొన్నారు.
Similar News
News October 15, 2025
రబీలో మేలైన ‘కంది’ రకాలివే..

తెలుగు రాష్ట్రాల్లో వర్షం, నీటి సదుపాయాన్ని బట్టి రబీలో కందిని ఈ నెలాఖరు వరకు సాగుచేసుకోవచ్చు. TGలో WRG-65, WRG-53, WRG-255, TDRG-59, LRG-41, ICPL-87119, ICPH-2740, TDRG-4 రకాలు అనువుగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఎకరానికి 5-6KGలు విత్తుకోవచ్చని తెలిపారు. ఆఖరి దుక్కిలో 20KGల నత్రజని, 50KGల భాస్వరంను వేయాలి, పైరు 30-40 రోజుల మధ్యలో మరో 20KGలను పైపాటుగా వేయాలని సూచిస్తున్నారు.
#ShareIt
News October 15, 2025
ప్రతి పండుగ రెండు రోజులు

హిందూ పండగలు తేదీలపై పండితుల తలో మాట కారణంగా రెండు రోజుల పండుగలుగా మారిపోతున్నాయి. సంక్రాంతి మినహాయిస్తే హోళీ, దసరా, దీపావళి పెద్ద పండుగలన్ని నిర్వహించే తేదీలపై డైలమా ఉంటుండడంతో రెండు రోజుల పాటు పండుగలను నిర్వహిస్తున్నారు. దీపావళి క్యాలెండర్లలో 20వ తేదీ ఉండగా, 21న జరుపుకోవాలని కొందరు పండితులు సూచిస్తుండడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఇచ్చే హలీడే జాబితాలో 20వ తేదీ ఉండడం కొసమెరుపు.
News October 15, 2025
HYD: ‘₹4,000 పెన్షన్ వస్తుందా!.. అందిరికీ తెల్సిందేగా’

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో BRS ప్రచారం ఉపందుకుంది. మంగళవారం కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు, నాయకులు రాగిడి లక్ష్మారెడ్డితో కలిసి ఎర్రగడ్డ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిళను ₹4,000 పెన్షన్ వస్తుందా? అని అడగ్గా ఆమె నవ్వుతూ ‘అందరికీ తెలిసిందేగా’ అని ఎద్దేవా చేశారు. ప్రజలు మళ్లీ కాంగ్రెస్ మాటలను నమ్మే పరిస్థితి లేదని విమర్శించారు.