News April 12, 2025
విశాఖ-తిరుపతి మధ్య వేసవి ప్రత్యేక రైలు

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అనకాపల్లి మీదుగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేరు డివిజన్ డీసీఎం సందీప్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. విశాఖ-తిరుపతి వీక్లీ ఎక్స్ప్రెస్ ప్రతి బుధవారం రాత్రి 7 గంటలకు విశాఖలో బయలుదేరుతుందన్నారు. తిరుపతి-విశాఖ స్పెషల్ రైలు ప్రతి గురువారం రాత్రి తిరుపతిలో బయలుదేరుతుందన్నారు. విశాఖ-కర్నూలు స్పెషల్ ప్రతి మంగళవారం రాత్రి 7 గంటలకు విశాఖలో బయలుదేరుతుందని పేర్కొన్నారు.
Similar News
News December 6, 2025
VZM: అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

తమిళనాడు రాష్ట్రంలో అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లాకి చెందిన నలుగురు మృతి చెందారు. రామేశ్వరం వద్ద ఆగి ఉన్న కారును అర్ధరాత్రి 2 గంటల సమయంలో లారీ ఢీకొట్టింది. మృతులు దత్తిరాజేరు, గజపతినగరం మండలాలకు చెందిన వారిగా గుర్తించారు. వీరంతా శబరిమల నుంచి తిరగివస్తున్నారు. ఘటనకు సంబందించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News December 6, 2025
కరీంనగర్: బాలికపై అత్యాచారం.. వ్యక్తికి 20ఏళ్ల జైలు

2022 ఫిబ్రవరి 3న నమోదైన మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో కరీంనగర్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. నగరంలోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బాలికపై లైంగిక దాడి చేసిన నేరస్థుడు మడుపు నర్సింహా చారికి శిక్ష పడింది. POCSO చట్టంలోని సెక్షన్ 6 కింద 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.1,000/- జరిమానా విధిస్తూ అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది.
News December 6, 2025
రూ.350 కోట్ల బంగ్లాలోకి ఆలియా గృహప్రవేశం.. ఫొటోలు

బాలీవుడ్ నటి ఆలియా భట్, నటుడు రణ్బీర్ కపూర్ దంపతులు ముంబైలోని పాలి హిల్లో తమ రూ.350 కోట్ల విలువైన కొత్త బంగ్లాలోకి ఇటీవల గృహప్రవేశం చేశారు. నవంబర్లో జరిగిన పూజకు సంబంధించిన ఫొటోలను ఆలియా తన Instaలో పంచుకున్నారు. ‘కృష్ణరాజ్’ పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ బంగ్లా సంప్రదాయ భారతీయ శైలితో పాటు ఆధునిక డిజైన్తో నిర్మించారు.


