News March 24, 2024
విశాఖ తీరంలో సోమర్సెట్… బాహుబలి నౌక!
భారత్, అమెరికా దేశాల సైనిక సంబంధాలు బలోపేతమయ్యేలా బంగాళాఖాతంలో విశాఖపట్నం కేంద్రంగా ‘టైగర్ ట్రయంప్’ ప్రత్యేక సాగర విన్యాసాలు జరుగుతున్నాయని నేవీ అధికారులు తెలిపారు. రెండు వారాలపాటు జరగనున్న ఈ విన్యాసాల కోసం బాహుబలి నౌకగా పేరొందిన ‘యూఎస్ సోమర్సెట్’ విశాఖతీరానికి చేరుకుంది. ఇది ఉభయచర యుద్ధ నౌకగా ఖ్యాతిగాంచింది.
Similar News
News September 29, 2024
కురుపాంలో యాక్సిడెంట్.. ఇద్దరు స్పాట్డెడ్
కురుపాం మండలం వలసబల్లేరు సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్లు ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని నీలకంఠపురం SI తెలిపారు. ఘటనలో బిడ్డిక జూజారు, బిడ్డిక శ్రీను మృతిచెందారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
News September 29, 2024
100 జిల్లాల్లో విజయనగరానికి స్థానం
కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న జన్ జాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ పథకాన్ని ప్రధాని నరేంద్రమోడి అక్టోబరు 2న ఆన్లైన్ వర్చువల్గా ప్రారంభించనున్నట్లు కలెక్టర్ అంబేద్కర్ ఆదివారం తెలిపారు. ఆదిమ గిరిజన తెగల వారు నివసించే దేశంలోని 100 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అందులో విజయనగరం జిల్లా కూడా ఉన్నట్టు పేర్కొన్నారు.
News September 29, 2024
విజయనగరం జిల్లాలో టెట్ పరీక్షా కేంద్రాలివే
అక్టోబర్ 3 నుంచి 21 వరకు (11, 12 తేదీలు మినహాయించి) జిల్లాలో టెక్ పరీక్ష జరగనుంది. కలువరాయి, చింతలవలస, కొండకారకం, గాజులరేగ, జొన్నాడ కేంద్రాలలో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 వరకు తిరిగి మరల 2.30 నుంచి సాయంత్రం 5 వరకు అన్ లైన్ పరీక్ష జరగనుంది.
పరీక్షకు హాజరయ్యేవారు గుర్తింపు కార్డులు తెచ్చుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్.ప్రేమ్ కుమార్ తెలిపారు.