News January 16, 2025
విశాఖ: నవోదయ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి

జవహర్ నవోదయ విద్యాలయలో ఆరో తరగతిలో ప్రవేశానికి ఈ నెల 18న నిర్వహించబోయే ఎంపిక పరీక్ష కోసం విశాఖ కలెక్టరేట్లో సమీక్షా నిర్వహించారు. కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పరీక్ష కేంద్రాలు, పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామ రాజు జిల్లాలలోని 39 కేంద్రాలలో ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ప్రిన్సిపల్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ పరీక్షకు 9080 మంది హాజరు కానున్నారు.
Similar News
News October 31, 2025
గడువులోగా మాస్టర్ ప్లాన్ రహదారులు పూర్తి చేయాలి: VMRDA ఛైర్మన్

భోగాపురం ఎయిర్పోర్టుకు అనుసంధానించే ప్రధాన రహదారుల పనులను గడువులోగా పూర్తి చేయాలని VMRDA ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం అధికారులతో సమావేశం నిర్వహించారు. మాస్టర్ ప్లాన్లోని 7 రహదారుల పురోగతిని ప్రతి 15 రోజులకు సమీక్షించనున్నట్లు తెలిపారు. కైలాసగిరిపై త్రిశూల్ ప్రాజెక్ట్, వుడా పార్క్లో స్కేట్ బోర్డ్ పనులు కూడా సకాలంలో పూర్తిచేయాలని సూచించారు.
News October 30, 2025
విశాఖ: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై రవాణా శాఖ అధికారుల తనిఖీలు

రవాణా కమీషనర్ ఆదేశాల మేరకు గురువారం రవాణా శాఖ అధికారులు విశాఖలో పలు చోట్ల తనిఖీలు చేశారు. 36 వాహనాలను తనిఖీ చేశారు. రహదారి నియమాలు పాటించకుండ, పర్మిట్ నియమాలను అతిక్రమించి తిరుగుతున్న ఒక బస్సుపై కేసు నమోదు చేశారు. ఈ తనిఖీలలో టాక్స్, పెనాల్టీ రూపేణా 2,45,000 వసులు చేశారు. ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయన్నారు.
News October 30, 2025
విశాఖ నగర డీసీపీ-1గా జగదీశ్ అడహళ్లి నియామకం

ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐపీఎస్ అధికారి జగదీశ్ అడహళ్లిని విశాఖపట్నం నగర డీసీపీ-1గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2020లో UPSCలో 440వ ర్యాంక్ సాధించి ఐపీఎస్ అధికారి అయిన ఆయన, మొదట అసిస్టెంట్ కమిషనర్గా పని చేశారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వంలో పలు బాధ్యతలు నిర్వర్తించారు. ఇటీవల అల్లూరి సీతారామ రాజు జిల్లాలో ఏఎస్పీగా పనిచేసిన జగదీశ్ అడహళ్లి తాజా బదిలీతో విశాఖ డీసీపీ-1 నియమితులయ్యారు.


