News April 3, 2024
విశాఖ: నేటి నుంచి పెన్షన్ల పంపిణీ

ఎన్నికల నిబంధనల మేరకు సామాజిక పెన్షన్ల పంపిణీ ప్రక్రియ బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభించేలా ఏర్పాట్లు చేశామని కలెక్టర్ మల్లికార్జున తెలిపారు. ఏప్రిల్, మే, జూన్ నెలల పెన్షన్లు గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది సచివాలయాల్లో అందజేస్తారన్నారు. పింఛనుదారులు ఆధార్ కార్డు తీసుకొని సచివాలయానికి రావాలన్నారు. 7వ తేదీ వరకు ఉదయం 7.30 నుంచి రాత్రి 7 గంటల వరకు పంపిణీ జరుగుతుందన్నారు.
Similar News
News October 31, 2025
విశాఖ రైతు బజార్లకు 3 వారాలపాటు సెలవులు లేవు

మొంథా తుఫాన్ ప్రభావంతో విశాఖలోని అన్ని రైతు బజార్లు వచ్చే 3 వారాల పాటు నిరంతరంగా కొనసాగించాలని CEO ఆదేశాలు జారీ చేశారు. వారానికి 7 రోజులు మార్కెట్లు పూర్తిగా ఓపెన్గా ఉంచాలని సూచించారు. ప్రజలకు అవసరమైన కూరగాయలు, నిత్యావసరాలు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మార్కెట్ కమిటీని ఆదేశించారు.
News October 31, 2025
విశాఖ: నదిలో గల్లంతైన బాలిక మృతదేహం లభ్యం

విశాఖ జిల్లా పద్మనాభం మండలం తునిపొలం గ్రామంలోని గెడ్డలో గురువారం ధనుశ్రీ (13) గల్లంతైన విషయం తెలిసిందే. తండ్రి శ్రీనుతో కలిసి బట్టలు ఉతికేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు గెడ్డలో పడిపోయింది. ధనుశ్రీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా.. శుక్రవారం ఉదయం మృతదేహం లభ్యమైంది. కుమార్తె మృతదేహం వద్ద తల్లి రోదన చూసి పలువురు కంటతడి పెట్టుకున్నారు.
News October 31, 2025
విశాఖ: నేటి నుంచి పాఠశాలల పునః ప్రారంభం

తుఫాన్ ప్రభావం తగ్గడంతో నేటి నుంచి యధావిధిగా పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. 3 రోజులుగా కొనసాగిన తుఫాన్ తరువాత పాఠశాలలు తెరుచుకోవడంతో విద్యాశాఖ అప్రమత్తమైంది. విద్యార్థుల భద్రత కోసం ఉపాధ్యాయులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని DEO ప్రేమ్కుమార్ ఆదేశాలు జారీ చేశారు. పాఠశాల పరిసరాల్లో చెట్ల కొమ్మలు, కరెంట్ వైర్లు, తడిసిన గోడలు వంటి అంశాలను పరిశీలించి విద్యార్థులను తరగతులకు అనుమతించాలని సూచించారు.


