News November 2, 2024

విశాఖ: నేడు రుషికొండ భవనాలను పరిశీలించనున్న సీఎం

image

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం విశాఖలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు హెలికాప్టర్లో రుషికొండకు చేరుకుంటారు. గత ప్రభుత్వం నిర్మించిన భవనాలను పరిశీలిస్తారు. తర్వాత అక్కడి నుంచి కలెక్టరేట్‌‌‌కు వెళతారు. అక్కడ సమీక్షా సమావేశం అనంతరం సాయంత్రం 4.30 గంటలకు కోస్టల్ బ్యాటరీ హెలిప్యాడ్‌కు చేరుకుని హెలికాప్టర్లో ఎయిర్పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం వెళ్తారు.

Similar News

News December 12, 2025

జీవీఎంసీ టౌన్ ప్లానింగ్‌లో 19 ఫిర్యాదులు

image

జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్ కార్యక్రమంలో 19 వినతులు వచ్చాయని చీఫ్ సిటీ ప్లానర్ ఏ.ప్రభాకారరావు తెలిపారు. శుక్రవారం ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సీపీలు, డీసీపీలు, ఏసీపీలతో కలిసి ప్రత్యేకంగా టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జీవీఎంసీ పట్టణ ప్రణాళికా విభాగానికి సంబంధించి ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకుంటున్నట్లు చీఫ్ సిటీ ప్లానర్ చెప్పారు.

News December 12, 2025

విశాఖలో సత్వా వాంటెజ్ సంస్థకు శంకుస్థాపన

image

దేశంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కన్సల్టింగ్ సంస్థ అయిన సత్వా వాంటెజ్ క్యాంపస్‌ను ఐటీ శాఖ మంత్రి లోకేశ్ శంకుస్థాపన చేశారు. రూ.1500 కోట్ల పెట్టుబడితో 3 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ క్యాంపస్‌లో 25 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, పరోక్షంగా 50 వేల మంది వరకు ఉపాధి పొందుతారని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

News December 12, 2025

ఐటీ హిల్స్‌లో ముఖ్యమంత్రికి ఘన స్వాగతం

image

మధురవాడ ఐటీ హిల్స్ ప్రాంగణంలో కాగ్నిజెంట్ కంపెనీ శాశ్వత భవనాల శంకుస్థాపనకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ఆయనకు నగర ఎమ్మెల్యేలు ఘనంగా స్వాగతం పలికారు. ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, గణబాబు, బండారు సత్యనారాయణమూర్తి, గంటా శ్రీనివాసరావు, కలెక్టర్ ఎం.ఎన్ హరేంధిర ప్రసాద్ స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.