News February 10, 2025
విశాఖ: పండుగ మిగిల్చిన విషాదం

అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం వాడరాంబిల్లి సముద్రతీరంలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు గల్లంతైన విషయం తెలిసిందే. వారు సూర్యదేవుని నోములు పండుగకు కుటుంబ సభ్యులతో వెళ్లారు. అందులో సూర్యతేజ్(17), పవన్ తేజ్ సముద్రంలో ఈతకు దిగారు. అలల తాకిడికి సముద్రంలో కొట్టుకుపోయారు. దగ్గరలోని మత్స్యకారులు సూర్యతేజను బయటకు తీసీ సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. పవన్ తేజ ఆచూకీ తెలియాల్సి ఉంది.
Similar News
News February 9, 2026
బలమైన బంధం కోసం రోజూ శృంగారం: సైంటిస్టులు

బలమైన సంబంధాల కోసం భార్యాభర్తలు ప్రతిరోజూ శృంగారంలో పాల్గొనాలని సైంటిస్టులు సూచిస్తున్నారు. భాగస్వాములు సన్నిహితంగా ఉన్న రోజుల్లో వారిలో ఒత్తిడి తగ్గుతుందని చెబుతున్నారు. కానీ ఇది 24 గంటల వరకేనని సూచిస్తున్నారు. అయితే రిలేషన్లో సమస్యలను తగ్గించుకునేందుకు జరిపే శృంగారం వల్ల తర్వాతి రోజు ఒత్తిడి పెరగొచ్చని హెచ్చరిస్తున్నారు. 319 జంటలపై చేసిన ఈ స్టడీ Archives of Sexual Behaviorలో ప్రచురితమైంది.
News February 9, 2026
శ్రీశైలంలో నేడు బృంగివాహన సేవ

శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా నేడు మల్లన్న బృంగివాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. ద్వారకా తిరుమల దేవస్థానం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా 3 వేల మంది పోలీసులతో భద్రత కల్పించి, డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచారు. భక్తుల కోసం 40 లక్షల లడ్డూలను అధికారులు అందుబాటులో ఉంచారు
News February 9, 2026
శ్రీశైలం బ్రహ్మోత్సవాలు.. 40లక్షల లడ్డూలు

శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా నేడు బృంగి వాహనంపై మల్లన్న భక్తులకు దర్శనమివ్వనున్నారు. ద్వారకా తిరుమల దేవస్థానం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా 3వేల మంది పోలీసులతో భద్రత కల్పించి, డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచారు. భక్తుల కోసం 40 లక్షల లడ్డూలను అధికారులు అందుబాటులో ఉంచారు.


