News February 10, 2025

విశాఖ: పండుగ మిగిల్చిన విషాదం

image

అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం వాడరాంబిల్లి సముద్రతీరంలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు గల్లంతైన విషయం తెలిసిందే. వారు సూర్యదేవుని నోములు పండుగకు కుటుంబ సభ్యులతో వెళ్లారు. అందులో సూర్యతేజ్(17), పవన్ తేజ్ సముద్రంలో ఈతకు దిగారు. అలల తాకిడికి సముద్రంలో కొట్టుకుపోయారు. దగ్గరలోని మత్స్యకారులు సూర్యతేజను బయటకు తీసీ సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. పవన్ తేజ ఆచూకీ తెలియాల్సి ఉంది.

Similar News

News March 17, 2025

అనంత: ప్రజల నుంచి కలెక్టర్ అర్జీల స్వీకరణ

image

అనంతపురం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సమస్యల అర్జీలను ప్రజల నుంచి స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. స్వీకరించిన అర్జీలను అధికారులతో పరిశీలించి సాధ్యమైనంత త్వరగా ప్రజలు ఇచ్చిన అర్జీలను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

News March 17, 2025

ఎంపీ డీకే అరుణ నివాసంలో హైదరాబాద్ పోలీసులు

image

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఎంపీ డీకే అరుణ ఇంట్లో ఓ ఆగంతకుడు చొరబడి గంటన్నర పాటు ఇంట్లో పలు గదులలో తిరిగిన విషయం తెలిసిందే. ఈ విషయంపై డీకే అరుణ భద్రత కల్పించాలని కోరారు. అందులో భాగంగా హైదరాబాద్ డీసీపీ విజ‌య్ కుమార్‌, ఏసీపీ వెంక‌టగిర సోమవారం ఎంపీ ఇంటికి వెళ్ళారు. అక్కడ ఆగంతకుడు తిరిగిన ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు డీకే అరుణను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.

News March 17, 2025

కోల్‌కతా వైద్యురాలి తల్లిదండ్రుల పిటిషన్ కొట్టివేత

image

కోల్‌కతా ఆర్జీకర్ వైద్యురాలి హత్యాచారం కేసుకు సంబంధించి మళ్లీ CBI విచారణ చేయించాలని ఆమె తల్లిదండ్రులు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ విచారణ జరిపిన కోర్టు దాన్ని కొట్టేస్తూ.. కోల్‌కతా హైకోర్టులో పిటిషన్ కొనసాగించవచ్చని సూచించింది. గతేడాది ఆగస్టు 9న ఆస్పత్రి సెమినార్‌ రూమ్‌లో ఒంటరిగా నిద్రిస్తున్న వైద్యురాలిపై అఘాయిత్యం జరిగింది. నిందితుడు సంజయ్‌కు కోర్టు జీవిత ఖైదు విధించిన విషయం తెలిసిందే.

error: Content is protected !!