News February 11, 2025
విశాఖ: పదో తరగతి పరీక్షకు 29,997 మంది

విశాఖలో మార్చి 17 నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను జిల్లా ఇన్ఛార్జి రెవెన్యూ అధికారి సీతారామారావు ఆదేశించారు.మంగళవారం ఆయన అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో మాట్లాడారు.విశాఖలో 134 కేంద్రాల్లో రెగ్యులర్ విద్యార్థులు 28,523, ఓపెన్ విద్యార్థులు 1,404 మొత్తం 29,997 మంది హాజరవుతున్నారని డీఈవో ప్రేమ కుమార్ తెలిపారు.
Similar News
News December 7, 2025
విశాఖలో రాత్రి పరిశుభ్రతపై జీవీఎంసీ కమిషనర్ ఆకస్మిక తనిఖీ

జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ శనివారం రాత్రి ఆర్టీసీ కాంప్లెక్స్, సిరిపురం, సత్యం జంక్షన్, సీతమ్మధర, డైమండ్ పార్క్, తదితర ప్రాంతాల్లో రాత్రి పరిశుభ్రత పనులను తనిఖీ చేశారు. కార్మికులతో మాట్లాడి బాధ్యతగా పని చేయాలని సూచించారు. నగర పరిశుభ్రత కోసం రాత్రి సానిటేషన్ కీలకమని, వాణిజ్య ప్రాంతాల్లో వ్యర్థాల సమయానుసార సేకరణ తప్పనిసరి అని కమిషనర్ పేర్కొన్నారు.
News December 7, 2025
పోలీసుల కట్టుదిట్టమైన భద్రతతో వన్డే మ్యాచ్ విజయవంతం

పీఎంపాలెం క్రికెట్ స్టేడియంలో శనివారం జరిగిన ఇండియా-సౌతాఫ్రికా వన్డే మ్యాచ్కు నగర పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. సీపీ శంఖబ్రత భాగ్చి ఆధ్వర్యంలో స్టేడియం చుట్టుపక్కల భారీగా సిబ్బందిని మోహరించి, డ్రోన్లతో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించారు. మ్యాచ్ చూడటానికి వచ్చిన అభిమానులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్రమబద్ధమైన నియంత్రణతో భద్రతను విజయవంతంగా నిర్వహించారు.
News December 7, 2025
గాజువాక: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

గాజువాకలోని ఓ ఇంట్లో వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పీ.లక్ష్మి (65) మానసిక వికలాంగుడైన తన చిన్న కుమారుడితో కలిసి ఉంటోంది. రెండో కుమారుడు నాగేశ్వరరావు తల్లిని చూసేందుకు శనివారం ఇంటికి వెళ్లగా.. లక్ష్మి విగతజీవిగా పడి ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. గాజువాక ఎస్ఐ సూర్యకళ ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. మృతదేహం కుళ్లిపోయి ఉండడంతో చనిపోయి 3-4 రోజులు అయి ఉంటుందన్నారు.


