News March 13, 2025
విశాఖ: పరీక్ష బాగా రాయలేదని విద్యార్థిని సూసైడ్

ఫిజిక్స్ పరీక్ష సరిగా రాయలేదని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖలో చోటుచేసుంది. సర్క్యూట్ హౌస్ సమీపంలో నివాసముంటున్న ఓ విద్యార్థిని ఫిజిక్స్ పరీక్ష రాసింది. ఇంటికి వచ్చి పరీక్ష బాగా రాయలేదని బాధపడగా ఆమె తల్లి ఓదార్చి నిద్రపోయింది. బుధవారం ఉదయం ఆమె నిద్రలేచి చూసేసరికి విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె తల్లి ఫిర్యాదు మేరకు త్రిటౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News October 17, 2025
విశాఖ: చోరీ కేసులో అక్కాచెల్లెలు అరెస్ట్

చోరీ కేసులో అక్కాచెల్లెలును విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజీవ్నగర్లో ఉంటున్న నరసింహరావు ఇంట్లో అనకాపల్లి జిల్లా సోమలింగాపురానికి చెందిన నాగమణి పనిచేస్తోంది. ఈనెల ఒకటో తేదీన బీరువాలో చెవి దిద్దులు, పచ్చలహారం నాగమణి దొంగతనం చేసి తన చెల్లెలు మంగకు ఇచ్చింది. గమనించిన ఇంటి యజమాని నరసింగరావు దువ్వాడ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టి ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
News October 17, 2025
విశాఖ: అక్టోబర్ 18న స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమాలు

అక్టోబర్ 18న మూడవ శనివారం “CLEAN AIR” అనే కాన్సెప్ట్పై స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ గురువారం తెలిపారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ఆ రోజు ఉదయం 6 గంటల నుంచి క్లీన్ ఎయిర్ కార్యక్రమం చేపట్టాలన్నారు. ఆరోజున శుభ్రత చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులను ఆదేశిస్తూ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు.
News October 16, 2025
విశాఖ పోలీసుల ఫైన్లపై మీరేమంటారు..!

విశాఖలో గత 15నెలల్లోనే పోలీసులు 8.54 లక్షల ఈ-చలాన్లు జారీ చేసి రూ.46.4కోట్ల ఫైన్ విధించారు. ఇప్పటి వరకు రూ.13.39కోట్లు రాబట్టారు. నగరంలో 12 లక్షల వాహనాలు ఉండగా.. కొందరు సిగ్నల్ జంప్, ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్ డ్రైవింగ్ చేస్తున్నారు. దీంతో ప్రమాదాలు జరిగి ప్రతి 2రోజులకు ముగ్గురు ప్రాణాలు కోల్పోతున్నారు.మరోవైపు షాపులు, రైతుబజార్ల వద్ద పార్క్ చేసిన వాహనాలకూ ఫైన్లు వేయడంపై విమర్శలు వస్తున్నాయి.