News December 30, 2024
విశాఖ: పలు రైళ్లకు జనవరి 1 నుంచి నంబర్ల మార్పు
తూర్పు కోస్తా రైల్వే పరిధిలో 7 రైళ్ల నంబర్లలో మార్పులు చేశారు. కటక్-గుణుపూర్ ప్యాసింజర్కు(68433/34),విశాఖ-కిరండూల్ ప్యాసింజర్కు (58501/02),విశాఖ-రాయ్పూర్ ప్యాసింజర్కు (58528/27), విశాఖ-కోరాపుట్ ప్యాసింజర్కు (58538/37), విశాఖ- బ్రహ్మపూర్ (58532/31), విశాఖ-గుణుపూర్ (58506/05), విశాఖ-భవానీపట్నం (58504/03) నంబర్లను కేటాయించారు. జనవరి 1నుంచి అమలులోకి రానున్నాయి.
Similar News
News January 13, 2025
నర్నీపట్నం: కస్తూరిబా గాంధీ పాఠశాల ప్రిన్సిపల్ సస్పెండ్
నర్సీపట్నం వేములపూడి కస్తూరిబా గాంధీ బాలికల గురుకుల ప్రిన్సిపల్ శాంతిని సస్పెండ్ చేస్తున్నట్లు సర్వ శిక్షా అభియాన్ ఏపీడి జయప్రకాశ్ ఉత్తర్వులు జారీ చేశారు. గురుకుల పాఠశాలలో బాలికలు అస్వస్థతకు గురైన సమయంలో సమాచారాన్ని ఒక రోజు ఆలస్యంగా అధికారులకు చెప్పడాన్ని తప్పుపడుతూ సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ అంశంలో మరో ఇద్దరు ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
News January 13, 2025
అనకాపల్లి: బాలిక పై అత్యాచారం
అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలంలో ఐదేళ్ల బాలిక పై 14 ఏళ్ల బాలుడు అత్యాచారం చేశాడు. ఈ ఘటన శనివారం జరగగా బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని ఆదే గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలుడు అత్యాచారం చేశాడు. బాలిక తల్లిదండ్రులకు ఫిర్యాదు మేరకు యలమంచిలి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. డీఎస్పీ సత్యనారాయణ దర్యాప్తు చేపట్టారు. బాలికను కేజీహెచ్కు తరలించారు.
News January 13, 2025
విశాఖ: 400 ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపిన ఆర్టీసీ
విశాఖ ద్వారక బస్సు స్టేషన్ నుంచి సంక్రాంతి సందర్భాన్ని పరిష్కరించుకుని 400 ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపినట్లు రీజినల్ మేనేజర్ బి.అప్పలనాయుడు తెలిపారు. నాలుగు రోజుల నుంచి హైదరాబాద్కు 25, విజయవాడకు 40 బస్సులు నడపగా, ఆదివారం శ్రీకాకుళం 100, రాజమండ్రికి 20, కాకినాడకు 20, పార్వతీపురానికి 40, సాలూరుకు 30 బస్సులతో పాటు రద్దీగా ఉన్న ప్రాంతాలకు ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపామన్నారు.