News December 29, 2024
విశాఖ-పార్వతీపురం రైలు ఆగనున్న స్టేషన్లు ఇవే..!

సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ విశాఖపట్నం నుంచి పార్వతీపురానికి కొత్తగా నడపనున్న రైలు 9 రైల్వే స్టేషన్లలో ఆగనుంది. విశాఖలో ఉదయం 10 గంటలకు బయలుదేరి సింహాచలం, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, గజపతినగరం, కోమటిపల్లి, డొంకినవలస, బొబ్బిలి, సీతానగరం రైల్వే స్టేషన్లలో ఆగి మధ్యాహ్నం 12.20 గంటలకు పార్వతీపురం చేరుకుంటుంది. తిరిగి 12.45కు బయలుదేరి సాయంత్రం 4కి విశాఖ చేరుకుంటుంది. >Share it
Similar News
News November 17, 2025
VZM: ‘నవంబర్ 30లోగా గృహాల సర్వే పూర్తి చేయాలి’

గృహాల కోసం దరఖాస్తులు చేసిన లబ్ధిదారులపై జరుగుతున్న సర్వేను నవంబర్ 30లోపు పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి సంబంధిత అధికారులకు సోమవారం ఆదేశించారు. ప్రభుత్వం గడువు నిర్ణయించినందున, ప్రతి అర్హత గల దరఖాస్తుదారుని వివరాలు సమగ్రంగా పరిశీలించి, ఎంపీడీవోలు యాప్లో వివరాలు నమోదు చేయాలని స్పష్టం చేశారు. సర్వేలో పారదర్శకత, కచ్చితత్వం పాటించాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు.
News November 17, 2025
VZM: ‘సివిల్ సర్వీసెస్లో ఉచిత శిక్షణ’

ఏపీ వెనుకబడిన సంక్షేమ, సాధికారత శాఖ ఆధ్వర్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ అభ్యర్థులకు సివిల్ సర్వీసెస్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ శాఖాధికారిణి జె.జ్యోతిశ్రీ తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈనెల 25లోపు ధరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనంతరం డిసెంబర్ 5న అభ్యర్థులకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తామన్నారు. పూర్తి వివరాలకు 96035 57333, 98668 86844 నంబర్లను సంప్రదించాలన్నారు.
News November 17, 2025
VZM: ‘సివిల్ సర్వీసెస్లో ఉచిత శిక్షణ’

ఏపీ వెనుకబడిన సంక్షేమ, సాధికారత శాఖ ఆధ్వర్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ అభ్యర్థులకు సివిల్ సర్వీసెస్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ శాఖాధికారిణి జె.జ్యోతిశ్రీ తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈనెల 25లోపు ధరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనంతరం డిసెంబర్ 5న అభ్యర్థులకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తామన్నారు. పూర్తి వివరాలకు 96035 57333, 98668 86844 నంబర్లను సంప్రదించాలన్నారు.


