News December 29, 2024
విశాఖ-పార్వతీపురం రైలు ఆగనున్న స్టేషన్లు ఇవే..!
సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ విశాఖపట్నం నుంచి పార్వతీపురానికి కొత్తగా నడపనున్న రైలు 9 రైల్వే స్టేషన్లలో ఆగనుంది. విశాఖలో ఉదయం 10 గంటలకు బయలుదేరి సింహాచలం, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, గజపతినగరం, కోమటిపల్లి, డొంకినవలస, బొబ్బిలి, సీతానగరం రైల్వే స్టేషన్లలో ఆగి మధ్యాహ్నం 12.20 గంటలకు పార్వతీపురం చేరుకుంటుంది. తిరిగి 12.45కు బయలుదేరి సాయంత్రం 4కి విశాఖ చేరుకుంటుంది. >Share it
Similar News
News January 17, 2025
VZM: జిల్లాలో రూ.22 కోట్ల మద్యం అమ్మకాలు
విజయనగరం జిల్లాలో గడిచిన మూడు రోజుల్లో రూ.22 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. సంక్రాంతి, కనుమ, ముక్కనుమ రోజుల్లో మందుబాబులు వైన్ షాపుల ముందు భారీగా క్యూ కట్టారు. జిల్లాలో 177 మద్యం షాపులు, 28 బార్లు ఉండగా 42,000 మద్యం కేసుల విక్రయాలు జరిగాయి. గతేడాది రూ.20 కోట్లు అమ్మకాలు జరగ్గా.. ఈ ఏడాది రూ.2 కోట్లు అదనంగా ఎక్సైజ్ శాఖకు ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.
News January 17, 2025
పార్వతీపురం: స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివాస్-
ప్రతి మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తునట్లు కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. దేశంలోనే అత్యంత పరిశుభ్ర రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో నెలలో ఒక శనివారం “స్వచ్ఛత” కోసం అంకితం కావాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు పిలుపు ఆకాంక్షించారన్నారు. అందులో భాగంగా ప్రతి నెలలో మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివాస కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు.
News January 17, 2025
గడ్డం ఉమ ట్వీట్కు లోకేశ్ రిప్లై
వైఎస్ జగన్ అభిమాని గడ్డం ఉమ ట్విటర్ వేదికగా కోరిన సాయానికి మంత్రి నారా లోకేశ్ స్పందించారు. విజయనగరం చిన్నారి శ్వాసకోస సమస్యతో బాధపడుతున్నారని, ట్రీట్మెంట్కు రూ.10 లక్షలు ఖర్చవుతుందని అన్నారు. పేద కుటుంబం కావడంతో చిన్నారి వైద్యానికి సాయం అందించాలంటూ ఆమె ‘X’లో లోకేశ్ను కోరారు. దీనికి స్పందించిన లోకేశ్ చిన్నారికి మెరుగైన వైద్యం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.