News December 19, 2024

విశాఖ: పాల సరఫరాను అడ్డుకున్న మహిళా కార్మికులు

image

అక్కిరెడ్డిపాలెం విశాఖ డెయిరీ గెట్ వద్ద మహిళా కార్మికులు వర్షంలో సైతం ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ బుధవారం రాత్రి పాల సరఫరాను అడ్డుకున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చి న్యాయం చేసే వరకు పాల సరఫరాను అడ్డుకుంటామని వారు స్పష్టం చేశారు. కాగా యాజమాన్యం స్పందించి వారితో మాట్లాడటంతో తాత్కాలికంగా నిరసనను విరమించారు.

Similar News

News November 19, 2025

ఉత్త‌రాంధ్ర‌లో అంచ‌నాల కమిటీ ప‌ర్య‌ట‌న‌

image

AP అంచ‌నాల క‌మిటీ ఈనెల 25-29 వ‌రకు ఉత్త‌రాంధ్రలో ప‌ర్య‌టించ‌నుంది. ఛైర్మ‌న్ వేగుళ్ల జోగేశ్వ‌రరావు అధ్య‌క్ష‌త‌న క‌మిటీ స‌భ్యులు 25న విశాఖ‌ చేరుకుంటారు. 26న సింహాచ‌లంలో స్వామిని ద‌ర్శ‌నం చేసుకొని.. దేవాదాయ శాఖ అధికారుల‌తో స‌మావేశమౌతారు. అనంత‌రం క‌లెక్ట‌రేట్‌‌లో అధికారులతో చ‌ర్చించ‌నున్నారు. 2019-20, 2020-21, 2021-22 ఆర్థిక సంవ‌త్స‌రాల్లో జ‌రిగిన ప‌నుల‌కు సంబంధించిన అంశాల‌పై స‌మీక్షిస్తారు.

News November 19, 2025

విశాఖ కమీషనరేట్‌లో వెయిటింగ్ హాల్ ప్రారంభం

image

విశాఖ నగర పోలీసు కమిషనర్ డా.శంఖబ్రత బాగ్చి కమీషనరేట్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన సందర్శకుల వెయిటింగ్ హాల్‌ను ప్రారంభించారు. కమిషనర్ కార్యాలయానికి వచ్చే ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రత్యేక గదిని ఏర్పాటు చేయాలని ఇచ్చిన ఆదేశాల మేరకు హాల్ సిద్ధం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు, ఏడీసీపీలు, ఏసీపీలు తదితర అధికారులు పాల్గొన్నారు.

News November 18, 2025

మహిళలు స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు సాధించాలి: రాయపాటి

image

మహిళలు స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలపై పురోగతి సాధించాలని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్శన్ డా.రాయపాటి శైలజ అన్నారు. మంగళవారం ఏయూ సెమినార్ హాల్‌లో దుర్గాబాయి దేశ్ ముఖ్ విమెన్ సెంటర్ ఫర్ స్టడీస్ ఆధ్వర్యంలో మహిళల భద్రతను నిలబెట్టడం, విజయానికి బెంచ్‌ మార్కింగ్ భవిష్యత్తును నిర్ధారించే అంశాలపై సెమినార్ నిర్వహించారు. విశాఖపట్నం జిల్లాకు ‘సేఫెస్ట్ సిటీ’ అని ర్యాంకింగ్ రావడం సంతోషంగా ఉందన్నారు.