News March 23, 2024

విశాఖ: పుట్టెడు దుఃఖంతో పదో తరగతి పరీక్ష రాసిన విద్యార్థి

image

పదో తరగతి పరీక్ష రాస్తున్న దేశగిరి యమునకు పుట్టెడు దుఃఖం కలిగింది. జీకే వీధికి చెందిన యమున తల్లి సరస్వతి మృతిచెందిన సమాచారం తండ్రి కేశకర్ణ చేరవేశారు. రక్తపోటు అధికమై కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందారు. పరీక్ష రాసి స్వగ్రామం దేవరపల్లిలో తల్లి అంత్యక్రియలకు విచ్చేసిన యమున బోరున విలపించింది. దీంతో గ్రామాల్లో విషాదఛాయలు అనుముకున్నాయి.

Similar News

News April 25, 2025

విశాఖలో చంద్రమోలి అంతిమ యాత్ర

image

పహల్గాంలో ఉగ్రమూకల కాల్పుల్లో మరణించిన చంద్రమోలి అంతిమ యాత్ర విశాఖలో ప్రారంభమైంది. పాండురంగాపురంలో ఆయన పార్థివదేహానికి మంత్రులు అనిత, సత్యకుమార్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ నివాళులు అర్పించి పాడె మోశారు. జ్ఞానాపురం శ్శశాన వాటికలో ఆయన దహన సంస్కణలు పూర్త చేయనున్నారు.

News April 25, 2025

విశాఖ జూలో వేసవి తాపానికి చెక్

image

వేసవికాలం గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో విశాఖ జూ పార్కులో వన్యప్రాణుల వేసవితాపం జూక్యూరేటర్ మంగమ్మ, సిబ్బంది ప్రత్యేక దృష్టి పెట్టారు. కొన్ని రకాల జంతువుల వద్ద వాటర్ స్పింక్లర్లు ఏర్పాటు చేయడం, సాదు జంతువులకు వాటర్ స్ప్రే చేయడం, కొన్ని రకాల పక్షులకు, జంతువులకు ఎయిర్ కండిషన్స్ ఏర్పాటు చేయడం వంటి సదుపాయాలు కల్పించారు.అదేవిధంగా వాటర్ మిలన్, కర్బూజా వంటి చల్లని పదార్థాలు అందజేస్తారు.

News April 25, 2025

విశాఖలో నేడు చంద్రమౌళి అంత్యక్రియలు

image

కశ్మీర్ ఉగ్రవాద దుర్ఘటనలో మృతి చెందిన చంద్రమౌళి అంత్యక్రియలు విశాఖలో శుక్రవారం ఉదయం 11.30 గంటలకు నిర్వహించనున్నారు. హోం మంత్రి వంగలపూడి అనిత, జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి బాల వీరాంజనేయులు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. అధికార లాంఛనాలతో ఈ కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చంద్రమౌళి మృతదేహానికి గురువారం రాత్రి ఘన నివాళులర్పించారు.

error: Content is protected !!