News April 1, 2025
విశాఖ: పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్

విశాఖలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం మంగళవారం ఉదయం నుంచి ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పాల్గొన్నారు. జీవీఎంసీ జోన్-4 జేఎస్ఎం కాలనీలో పలువురు లబ్ధిదారులకు కలెక్టర్ పెన్షన్ పంపిణీ చేశారు. అనంతరం వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. కాలనీలో మౌలిక వసతులపై ఆరా తీశారు. ఈరోజు సాయంత్రంలోగా శతశాతం పంపిణీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News April 8, 2025
ఆదివారం కూడా పన్ను చెల్లించవచ్చు: కలెక్టర్

జీవీఎంసీ పరిధిలో ఆస్తిపన్ను చెల్లింపుదారులు ఏప్రిల్ 30వ తేదీ లోపు ఏడాది పన్ను అంతా చెల్లించి 5 శాతం రాయితీ పొందవచ్చని GVMC ఇన్ఛార్జ్ కమిషనర్ హరేంధీర ప్రసాద్ మంగళవారం తెలిపారు. ఈ నెలలో ఆదివారం కూడా పన్ను చెల్లించవచ్చు అన్నారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు అన్ని జోనల్ కార్యాలయాల్లో ఉదయం 9 నుంచి రాత్రి 8 వరకు ప్రత్యేక కౌంటర్లు అందుబాటులో ఉంటాయని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News April 8, 2025
విశాఖలో ఈ ఏరియాలకు రిపోర్టర్లు కావలెను

విశాఖ నగరంలోని కొమ్మాది, జగదాంబ జంక్షన్, కేజీహెచ్, పోర్ట్ ఏరియా, పద్మనాభం, ఎండాడ, కైలాసగిరి, గాజువాక ఏరియాల్లో వే2న్యూస్లో పని చేసేందుకు రిపోర్టర్లు కావలెను. పబ్లిష్ అయిన ప్రతి వార్తకు అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అనుభవం ఉన్న వారు మాత్రమే ఈ లింక్పై <
News April 8, 2025
CREDAI విశాఖ చాప్టర్ ఛైర్మన్గా ధర్మేందర్

కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (CREDAI) విశాఖ చాప్టర్ 2025-26 చైర్మన్ గా వి. ధర్మేందర్, అధ్యక్షుడిగా ఇ.అశోక్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా వి.శ్రీను ఎన్నికయ్యారు. కోశాధికారిగా కె.శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. రియల్ ఎస్టేట్ అభివృద్ధికి కృషి చేస్తామని కార్యవర్గం ప్రకటించింది. విశాఖ రియల్ ఎస్టేట్ రంగంలో CREDAI కీలక పాత్ర పోషిస్తోందన్నారు.