News February 27, 2025

విశాఖ పోలీసుల పర్యవేక్షణలో పుణ్యస్నానాలు

image

శివరాత్రి జాగరణ అనంతరం విశాఖ నగరవాసులు గురువారం సముద్రంలో పుణ్యస్నానాలు చేశారు. వీరి కోసం అటు అధికారులు ఇటు పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా పోలీస్ బలగాలను మోహరించినట్లు నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత భాగ్చీ తెలిపారు. అలాగే జన సందోహంలో చిన్నారులు తప్పిపోకుండా ఉండేందుకు అధునాతన రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ వ్యవస్థను ఉపయోగించారు.

Similar News

News October 21, 2025

విశాఖ: లెక్కల్లో తేడాలొస్తే భారీ మూల్యమే

image

GVMC పరిధిలో ఆస్తి పన్నుల వసూళ్లు రికార్డుస్థాయిలో సాగుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి 6నెలల్లోనే రూ.256.5 కోట్లు వసూలు కాగా, వచ్చే 6నెలల్లో మరో రూ.276.49 కోట్లు వసూలు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈసారి జీవీఎంసీ రెవెన్యూ విభాగం ‘లైన్ లిస్టింగ్’ పేరుతో 8 జోన్ల పరిధిలో ఇళ్లు, దుకాణాలు, వాణిజ్య సముదాయాలను పరిశీలిస్తుంది. లెక్కల్లో తేడాలొస్తే అధికారులు భారీగా పన్నులు విధిస్తున్నారు.

News October 21, 2025

విశాఖ 572 మంది ఆర్టీసీ సిబ్బందికి ప్రమోషన్లు

image

విశాఖపట్నం ఏపీఎస్ఆర్టీసీ సిబ్బందికి ప్రమోషన్లు మంజూరు కానున్నాయి. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 572 మందికి వివిధ కేటగిరీల్లో ప్రమోషన్లు సిద్ధం చేసినట్లు రీజనల్ మేనేజర్ అప్పలనాయుడు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వీరిలో ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్లు 27, మెకానికల్ సూపర్వైజర్లు 113, ఏడీసీలు 115, కండక్టర్లు గ్రేడ్-1 130, డ్రైవర్లు గ్రేడ్-1 167 మంది ఉన్నారు.

News October 20, 2025

విశాఖలో జరిగే సీఐఐ సదస్సులో పాల్గొనండి: నారా లోకేష్

image

ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్(AIBC) ప్రతినిధులతో న్యూసౌత్ వేల్స్ పార్లమెంట్ ఆవరణలో సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల సాధించిన పెట్టుబడులను వివరించారు. విశాఖలో నవంబర్ 14, 15 తేదీల్లో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఐఐ సమ్మిట్‌లో పాల్గొనవలసిందిగా కోరారు.