News September 8, 2024

విశాఖ: ‘ప్రతి లక్ష మందిలో 12 మంది ఆత్మహత్య’

image

ప్రతి లక్ష మందిలో 12 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారని ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ ఎన్.ఎన్ రాజు అన్నారు. ఈనెల 12న ఆత్మహత్యల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆదివారం అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో పీఏపీ కార్యదర్శి కామేశ్వరరావు అధ్యక్షతన ఆత్మహత్యలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆత్మహత్యకు పాల్పడే గుర్తించే అవకాశం యువతకు, కుటుంబ సభ్యులకు ఉంటుందని వెంటనే వారిని కాపాడాలని కోరారు.

Similar News

News September 19, 2025

విశాఖ: గోల్డ్ డిపాజిట్ పేరుతో మోసం.. ముగ్గురి అరెస్టు

image

వన్ టౌన్‌లో నివాసం ఉంటున్న నవీన్ కుమార్ దంపతులను గోల్డ్ డిపాజిట్ పేరుతో మోసం చేసిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు సీఐ జీడి బాబు తెలిపారు. బాధితులకు గోల్డ్ ఇస్తామని రూ.3 కోట్లు తీసుకొని ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడ్డారని చెప్పారు. నిందితులు దామోదర నాయుడు, ఉమామహేశ్వరరావు, దిలీప్‌లను రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఎవరైనా బాధితులు ఉంటే నేరుగా వన్ టౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేయాలన్నారు.

News September 18, 2025

విశాఖలో 524 ఆక్రమణల తొలగింపు

image

విశాఖలో ఆపరేషన్ లంగ్స్‌లో భాగంగా 524 ఆక్రమణల తొలగించారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాల మేరకు ఆపరేషన్ లంగ్స్ చేపట్టినట్లు చీఫ్ సిటీ ప్లానర్ ప్రభాకర రావు గురువారం తెలిపారు. జోన్ 1లో 20 ఆక్రమణలు, జోన్-2 90, జోన్ -3లో 42, జోన్ -4 60, జోన్ -5లో 52, జోన్-6లో 86, జోన్ – 7లో 42, జోన్-8లో 67 ఆక్రమణలు తొలగించారు.

News September 18, 2025

ఈ-గవర్నెన్స్ సదస్సుకు అన్ని ఏర్పాట్లు చేయాలి – కలెక్టర్

image

విశాఖలో సెప్టెంబ‌ర్ 22, 23న జరిగే 28వ జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సుకు పక్కా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గురువారం కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడారు. నోవాటెల్ హోటల్‌లో జరిగే ఈ సదస్సులో ఐటీ నిపుణులు, కేంద్ర-రాష్ట్ర మంత్రులు పాల్గొననున్నారని తెలిపారు. 13 ప్రధాన, 10 ఉప కమిటీల సమన్వయంతో నగర సుందరీకరణ, భద్రత, శానిటేషన్ తదితర చర్యలు చేపట్టాలని సూచించారు.