News October 5, 2024

విశాఖ: ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే బాలిక మృతి

image

ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పుంగనూరులో అదృశ్యమైన బాలిక మృతిచెందిందని ఎమ్మెల్సీ, వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి ఆరోపించారు. పోలీసులు సరైన రీతిలో స్పందించి ఉంటే తల్లిదండ్రులకు కడుపుకోత ఉండేది కాదన్నారు. విశాఖలో ఆమె మాట్లాడుతూ.. కాలిన కాగితాలకున్న విలువ ఆడబిడ్డల ప్రాణాలకు లేదని విమర్శించారు. బాలిక మృతి సంఘటనను దర్యాప్తు లేకుండానే నీరు గార్చాలని పోలీసులు చూస్తున్నట్లు తెలిపారు.

Similar News

News October 30, 2025

విశాఖలో బెండకాయలు రూ.54

image

విశాఖ రైతు బజార్‌లలో కూరగాయల ధరలను వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు గురువారం విడుదల చేశారు. వాటి వివరాలు (రూ.కిలో) టమాటా రూ.30, ఉల్లిపాయలు రూ.20/22, వంకాయలు రూ.40/44/54, బెండకాయ రూ.54, మిర్చి రూ.40, కాకరకాయ రూ.36, అనపకాయ రూ.26, క్యాబేజీ రూ.24, దొండ రూ.42, బీన్స్ రూ.66, పోటల్స్ రూ.62, చిలకడ రూ.30, కంద రూ.52, బద్ద చిక్కుడు రూ.66, తీపిగుమ్మిడి రూ.30, కరివేపాకు రూ.50, బీరకాయ రూ.46గా ఉన్నాయి.

News October 30, 2025

‘83 పునరావాస కేంద్రాల్లో 1516 మందికి ఆశ్రయం’

image

మొంథా తుఫాన్ నేపథ్యంలో జిల్లాలో 83 పునరాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలలో 1,516 మంది ఆశ్రయం పొందారు. ములగాడ మండలంలో 7 పునరావాస కేంద్రాల్లో 782 మంది ఆశ్రయం పొందారు. మహారాణిపేటలో 7 పునరావాస కేంద్రాల్లో అత్యధికంగా 520 మంది ఆశ్రయం పొందారు. సీతమ్మధార మండలంలోని 7 పునరావస కేంద్రాల్లో 82 మందికి ఆశ్రయం కల్పించినట్లు అధికారులు వెల్లడించారు.

News October 30, 2025

తుపాన్ ప్రభావంతో జిల్లాలో 22 ఇళ్లకు నష్టం

image

మొంథా తుఫాన్ నేపథ్యంలో జిల్లాలో 22 ఇళ్లు దెబ్బతిన్నట్లు అధికారులు బుధవారం ప్రకటన విడుదల చేశారు. ఆనందపురం మండలంలో 8, పద్మనాభం మండలంలో 6, భీమిలి మండలంలో 3, గోపాలపట్నం మండలంలో 2, పెదగంట్యాడ మహారాణిపేట విశాఖ రూరల్‌లో ఒక్కొక్క ఇల్లు దెబ్బతిన్నట్లు నివేదికలో తెలిపారు. వీటిలో పూర్తిగా దెబ్బతిన్నవి 2 ఉన్నట్లు చెప్పారు.