News March 29, 2024

విశాఖ: బీటెక్ విద్యార్థినికి వేధింపులు.. యువకుడిపై కేసు

image

మాకవరపాలెం సమీపంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థిని వెంటపడి వేధిస్తున్నాడన్న ఆరోపణపై నర్సీపట్నం కొత్తవీధికి చెందిన యువకుడు వి.అయ్యప్పపై కేసు నమోద అయ్యింది. గురువారం కేసు నమోదు చేసినట్లు నర్సీపట్నం పట్టణ సీఐ కాంతికుమార్ తెలిపారు. ఈ యువకుడు కొద్దిరోజులుగా కళాశాల వరకు ఆమె వెంట పడటమే కాకుండా అటకాయించి కొట్టేందుకు ప్రయత్నించాడని వివరించారు.

Similar News

News November 14, 2025

లక్షణాలు కనిపిస్తే వైద్యుని సంప్రదించండి: DMHO

image

ప్రపంచ డయాబెటిస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం డిఎంహెచ్ఓ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. డయాబెటిస్ లక్షణాలు కనిపిస్తే వైద్యుని సంప్రదించాలని DMHO జగదీశ్వరరావు అన్నారు. తరచుగా మూత్ర విసర్జన, మానసిక స్థితిలో, కళ్ల దృష్టిలో మార్పు, బరువు తగ్గడం,బలహీనతగా ఉండటం, ఎక్కువగా దాహం కలగడం వంటి లక్షణాల ఉంటే అప్రమత్తంగా ఉండాలన్నారు. దగ్గరలో ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేసుకోవాలన్నారు.

News November 14, 2025

బీహార్ విజయంపై ఎన్డీయే నేతల సెలబ్రేషన్స్

image

బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే ఘన విజయాన్ని పురస్కరించుకుని విశాఖలో సీఎం చంద్రబాబు కూటమి నేతలకు శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర మంత్రులు పియూష్ గోయల్, రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస వర్మ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, కూటమి ఎంపీలు పరస్పరం స్వీట్లు తినిపించుకొని ఆనందం పంచుకున్నారు.

News November 14, 2025

మూడేళ్లలో విశాఖలో లూలూ మాల్

image

మూడేళ్లలో విశాఖలో ‘లూలూ’ మాల్‌ను పూర్తి చేయనున్నట్లు ఆ సంస్థ ఛైర్మన్‌ యూసఫ్ అలీ తెలిపారు. CII సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు. 2018లో మాల్‌కు శంకుస్థాపన చేశామన్నారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత పలు కారణాలతో ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు చెప్పారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ మళ్లీ తెరపైకి వచ్చిందన్నారు. ఈ మాల్‌ ద్వారా ప్రత్యక్షంగా 5వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు.