News April 24, 2024

విశాఖ: బొగ్గు రవాణా నిలిచిపోవడంపై హైకోర్టులో కేసు

image

స్టీల్ ప్లాంట్‌కు గంగవరం అదానీ పోర్టు నుంచి బొగ్గు రవాణా నిలిచిపోవడంపై ఉక్కు అధికారుల సంఘం హైకోర్టులో కేసు వేసింది. గంగవరం పోర్టులో విశాఖ స్టీల్ ప్లాంట్‌కు చెందిన కోకింగ్ కోల్, లైన్ స్టోన్ సుమారు మూడు లక్షల టన్నులు ఉందన్నారు. ఈనెల 12 నుంచి పోర్ట్ కార్మికుల ఆందోళన వల్ల వాటి రవాణా నిలిచిపోయిందన్నారు. దీనిపై కోర్టు స్పందిస్తూ ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేసినట్లు సంఘం ప్రతినిధి ప్రసాద్ తెలిపారు.

Similar News

News December 2, 2025

రేపటి నుంచి సింహాచలం నృసింహ దీక్షలు ప్రారంభం

image

సింహాచలంలో డిసెంబర్ 3వ తేదీ నుంచి నృసింహ దీక్షలు ప్రారంభం కానున్నట్లు ఈవో సుజాత మంగళవారం తెలిపారు. డిసెంబర్ 3 నుంచి జనవరి 12వ తేదీ వరకు ఈ దీక్షలు ఉండనున్నట్లు పేర్కొన్నారు. మొదటి విడత దీక్షలు డిసెంబర్ 3 నుంచి, రెండో విడత దీక్షలు డిసెంబర్ 11వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు తెలిపారు. పై తేదీలలో మాల ధరించే భక్తులకు తులసి మాలలు, స్వామివారి ప్రతిమ ఉచితంగా ఇవ్వనున్నట్లు చెప్పారు.

News December 2, 2025

రేపటి నుంచి సింహాచలం నృసింహ దీక్షలు ప్రారంభం

image

సింహాచలంలో డిసెంబర్ 3వ తేదీ నుంచి నృసింహ దీక్షలు ప్రారంభం కానున్నట్లు ఈవో సుజాత మంగళవారం తెలిపారు. డిసెంబర్ 3 నుంచి జనవరి 12వ తేదీ వరకు ఈ దీక్షలు ఉండనున్నట్లు పేర్కొన్నారు. మొదటి విడత దీక్షలు డిసెంబర్ 3 నుంచి, రెండో విడత దీక్షలు డిసెంబర్ 11వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు తెలిపారు. పై తేదీలలో మాల ధరించే భక్తులకు తులసి మాలలు, స్వామివారి ప్రతిమ ఉచితంగా ఇవ్వనున్నట్లు చెప్పారు.

News December 2, 2025

విశాఖ: ‘మా కొడుకును కోడలే చంపింది’

image

విశాఖలో ఓ వ్యక్తి ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. కిశోర్, మౌనిక ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ దొండపర్తి సమీపంలోని కుప్పిలి వీధిలో ఉంటున్నారు. కొంతకాలంగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి కూడా ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా.. కిశోర్ ఉరివేసుకున్నాడు. అయితే కోడలే తమ కొడుకుని హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరిస్తోందని కిశోర్ తల్లి ఫోర్త్ టౌన్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.