News April 25, 2024
విశాఖ: ‘భరత్ అనే నేను’ అనేదెవరు?

ఉమ్మడి విశాఖ జిల్లాలో టీడీపీ, వైసీపీ పార్టీల నుంచి భరత్ అనే పేరుతో ఇద్దరు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. విశాఖ కూటమి ఎంపీ అభ్యర్థిగా టీడీపీ నుంచి మతుకుమిల్లి శ్రీ భరత్ పోటీ చేస్తుండగా.. అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మలసాల భరత్ బరిలో ఉన్నారు. ఇద్దరూ ఉన్నత విద్యావంతులే. మరి వీరిలో గెలిచి ‘భరత్ అనే నేను’ అంటూ ప్రమాణ స్వీకారం చేసేదెవరని మీరు భావిస్తున్నారో కామెంట్ చెయ్యండి.
Similar News
News December 14, 2025
ఏయూలో రేపటి నుంచి ‘సరస్’ డ్వాక్రా బజార్

విశాఖ ఏయూ ఇంజినీరింగ్ మైదానంలో రేపటి (డిసెంబర్ 15) నుంచి 26వ తేదీ వరకు ‘సరస్’ (SARAS) అఖిల భారత డ్వాక్రా బజార్ జరగనుంది. గ్రామీణ మహిళల ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించే ఈ ప్రదర్శనలో దేశవ్యాప్తంగా 600 మంది మహిళలు.. 250 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. చేనేత వస్త్రాలు, హస్తకళలు, ఆహార పదార్థాలు ఇక్కడ లభిస్తాయని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు.
News December 14, 2025
విశాఖలో ఉత్సాహంగా నేవీ మారథాన్

నేవీ డే వేడుకల్లో భాగంగా విశాఖపట్నం బీచ్ రోడ్డులో ఆదివారం ఉదయం ‘నేవీ మారథాన్’ అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్, నేవీ అధికారులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో సాగిన ఈ మారథాన్లో నగర వాసులు, నేవీ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.
News December 14, 2025
ప్రభుత్వ కార్యాలయాలలో రేపు PGRS: విశాఖ కలెక్టర్

విశాఖ కలెక్టరేట్ కార్యాలయంలో డిసెంబర్ 15న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం, జోనల్ కార్యాలయాల్లో, సీపీ కార్యాలయంలో ఉదయం వినతులు స్వీకరించనున్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.


