News June 5, 2024

విశాఖ మంత్రులకు రాష్ట్రంలోనే భారీ ఓటమి

image

ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీ ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన గుడివాడ అమర్నాథ్, ముత్తంశెట్టి శ్రీనివాసరావు భారీ ఓటమి చవిచూశారు. రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో గెలిచిన తొలి రెండు స్థానాల్లో ఓడిన అభ్యర్థులు వీరే కావడం గమనార్హం. గాజువాకలో అమర్నాథ్‌పై పల్లా శ్రీనివాస్‌రావు 95,235 ఓట్ల మెజారిటీతో గెలిపొందగా, అవంతిపై గంటా శ్రీనివాస్ రావు 92,401 ఓట్ల తేడాతో గెలిపొందారు.

Similar News

News October 26, 2025

విశాఖ కలెక్టరేట్‌లో రేపటి ‘పీజీఆర్ఎస్’ రద్దు: కలెక్టర్

image

‘మొంథా’ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో, విశాఖ కలెక్టరేట్‌లో సోమవారం (అక్టోబర్ 27) జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తెలిపారు. తుఫాను ముందస్తు చర్యల కోసం అధికారులు అందుబాటులో ఉండాల్సి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే వారం PGRS యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.

News October 26, 2025

విశాఖ: నడిసంద్రంలో బిక్కుబిక్కుంటూ

image

విశాఖలోని జాలరిపేటకు చెందిన ఎల్లాజీ శుక్రవారం ఉదయం చేపల వేటకు వెళ్లి గల్లంతైన విషయం తెలిసిందే. శనివారం 8 బోట్ల సహాయంతో గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. వేట సమయంలో తిరగబడిపోయిన తెప్పపై 40 గంటల పాటు నిలబడి ప్రాణాలు కాపాడుకున్నాడు. బిక్కుబిక్కుమంటూ ఉన్న ఎల్లాజీని కాకినాడ జిల్లా కంతంపేట మత్స్యకారులు గమనించి కాపాడారు. స్థానిక జేడి ఆఫీసుకి సమాచారం అందజేయండంతో విశాఖ తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

News October 26, 2025

మంత్రి సత్యకుమార్ విశాఖ పర్యటన రద్దు

image

ఆరోగ్య శాఖామంత్రి సత్య కుమార్ యాదవ్ విశాఖ పర్యటన రద్దయింది. ఆదివారం రాత్రి విశాఖ చేరుకుని మూడు రోజుల పాటు నగరంలో పర్యటించనున్నారని మొదట ప్రకటన జారీ చేశారు. అయితే మొంథా తుపాన్ నేపథ్యంలో ఆయన పర్యటన రద్దు అయినట్లు అధికారులు తెలిపారు.