News May 10, 2024
విశాఖ: మందుకు డబ్బులు ఇవ్వలేదని హత్య.. ముగ్గురికి యావజ్జీవం

హత్య కేసులో ముగ్గురికి యావజ్జీవ జైలు శిక్ష విధిస్తూ విశాఖ నగర మెట్రోపాలిటీ స్పెషల్ జడ్జ్ ఎం.వెంకటరమణ గురువారం తీర్పు ఇచ్చారు. 2013 అక్టోబర్ 1న దేవుడనే వ్యక్తిని నిందితులు పీ.మధు, సోమశేఖర్, అనిల్ మద్యం కోసం డబ్బులు అడిగారు. డబ్బులు లేవని చెప్పడంతో దేవుడిపై దాడి చేశారు. భార్య పార్వతి దేవుని KGHలో చేర్పించింది. అక్కడ చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి చనిపోయాడు. ఈ మేరకు పోలీసులు ఛార్జిషీట్ వేశారు.
Similar News
News November 18, 2025
రేపే దీపోత్సవం.. ఏర్పాట్లు పూర్తి

పద్మనాభంలో వేంచేసి ఉన్న శ్రీఅనంతపద్మనాభ స్వామి దీపోత్సవ కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. రేపు సాయంత్రం 5:30లకు జైగంట మోగగానే మెట్లకి ఇరువైపులా దీపాలు వెలిగించే కార్యక్రమం మొదలవుతుంది. ఆ సమయంలో భక్తులు జాగ్రత్తగా ఉండాలి.
News November 18, 2025
రేపే దీపోత్సవం.. ఏర్పాట్లు పూర్తి

పద్మనాభంలో వేంచేసి ఉన్న శ్రీఅనంతపద్మనాభ స్వామి దీపోత్సవ కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. రేపు సాయంత్రం 5:30లకు జైగంట మోగగానే మెట్లకి ఇరువైపులా దీపాలు వెలిగించే కార్యక్రమం మొదలవుతుంది. ఆ సమయంలో భక్తులు జాగ్రత్తగా ఉండాలి.
News November 18, 2025
సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న బాలకృష్ణ

సింహాచలం దేవస్థానంలో అప్పన్న స్వామిని సినీ నటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ దర్శించుకున్నారు. మంగళవారం సింహాచలం వచ్చిన బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీనుని ఏఈవో తిరుమల ఈశ్వరరావు, వేద పండితులు ఆలయ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. సాయంత్రం అఖండ-2 సినిమా సాంగ్ను విడుదల చేయనున్నారు.


