News March 17, 2025
విశాఖ: మద్యానికి డబ్బులు ఇవ్వలేదని ఆత్మహత్య

ఆనందపురం పోలీస్ స్టేషన్ పరిధి బాకువరపాలెంలో ఉరివేసుకుని యువకుడు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు రమేశ్ (25) మద్యానికి బానిసయ్యాడు. భార్య మద్యానికి డబ్బులు ఇవ్వలేదని ఆదివారం రాత్రి ఉరి వేసుకుని మృతి చెందినట్లు తెలిపారు. రమేశ్ భార్య ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. పోస్ట్మార్టం నిమిత్తం డెడ్బాడీని భీమిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
Similar News
News March 18, 2025
విశాఖ: అదనపు కోచ్లతో రైళ్ల పెంపు

ప్రయాణీకుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి అదనపు కోచ్లతో రైళ్లను పెంచాలని ఈస్ట్ కోస్ట్ రైల్వే నిర్ణయించింది. రైలు నెం. 58506/58505 విశాఖపట్నం – గుణుపూర్ – విశాఖపట్నం ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ 1×8 నుంచి ఒక స్లీపర్ క్లాస్ కోచ్తో పెంచబడుతుంది. రైలు నం. 18512/ 18511 విశాఖపట్నం – కోరాపుట్ – విశాఖపట్నం ఎక్స్ప్రెస్ 17 తేది నుంచి రెండు స్లీపర్ క్లాస్ కోచ్తో పెంచబడుతుంది.
News March 18, 2025
రాజమండ్రి: కోర్టుకు ట్రైల్కు తీసుకువచ్చిన నిందితుడు పరార్

విశాఖపట్నానికి చెందిన 35ఏళ్ల లావేటి తల్లిబాబును సోమవారం ఒక కేసులో ట్రైల్ నిమిత్తం సెంట్రల్ జైలు నుంచి రాజమండ్రి కోర్టులో హాజరుపరిచారు. అక్కడ నుంచి తప్పించుకుని పారిపోయాడని త్రీటౌన్ ఇన్స్పెక్టర్ అప్పారావు తెలిపారు. పారిపోయే సమయంలో పై ఫొటోలో ఉన్న విధంగా దుస్తులు ధరించి ఉన్నాడని, ఆచూకీ తెలిసిన వారు 94407 96532 ఫోన్ నంబరుకు తెలపాలన్నారు
News March 18, 2025
విశాఖ స్టేడియంలో నేడు ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాక్టీస్

విశాఖ నగరంలో ఐపీఎల్ సందడి మొదలైంది. ఈ నెల 24న లక్నో సూపర్ జెయింట్స్తో జరగనున్న మ్యాచ్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ నగరానికి చేరుకుంది. ఇవాళ ఆ టీమ్ సారథి అక్షర్ పటేల్ ఆధ్వర్యంలో జట్టు సభ్యులు ప్రాక్టీస్ సెషన్లో పాల్గొననున్నారు. కాగా ఇప్పటికే మ్యాచ్ టిక్కెట్ల విక్రయాలు సైతం ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది విశాఖలో జరగనున్న ఈ తొలి మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.