News September 22, 2024
విశాఖ: మరింత మెరుగైన ప్రగతి సాధించాలి

ఎన్ఐర్ఎఫ్ ర్యాకింగ్లో రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు మరింత మెరుగైన ప్రగతి సాధించాలని సీఎం చంద్రబాబు, హెచ్ఎర్డీ మంత్రి నారా లోకేశ్ ఆకాంక్షిస్తున్నారని రాష్ట్ర ఉన్నత విద్య మండలి ఛైర్మన్ (ఇన్ఛార్జ్) కె.రామ్మోహన రావు అన్నారు. రాష్ట్ర విశ్వవిద్యాలయాలు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకుల మెరుగుపరచుకోవడంపై శనివారం వర్చువల్ సదస్సును నిర్వహించారు. సదస్సులో ఏయూ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ శశిభూషణరావు పాల్గొన్నారు.
Similar News
News December 1, 2025
విశాఖ: ప్రపంచ ఎయిడ్స్ నిర్మూలనా దినోత్సవ ర్యాలీ ప్రారంభించిన కలెక్టర్

విశాఖపట్నం జిల్లా పరిషత్లో సోమవారం ప్రపంచ ఎయిడ్స్ నిర్మూలనా దినోత్సవం ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ప్రారంభించారు. ఎయిడ్స్ వ్యాధి బారిన పడిన వారి స్వయం ఉపాధి కోసం మహిళలకు కలెక్టర్ చేతుల మీదుగా కుట్టు మిషన్లు అందించారు. అనంతరం ఎయిడ్స్ వ్యాధి బారిన పడిన చిన్నారులతో కలసి కలెక్టర్ అల్పాహారం తీసుకున్నారు. చిన్నారులతో మాట్లాడి వారి చదువు, యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
News December 1, 2025
పంచగ్రామాల సమస్య పరిష్కరించాలని డిమాండ్

సింహాచలం దేవస్థాన పంచ గ్రామాల భూ సమస్యను పరిష్కరించాలని నిర్వసితులు డిమాండ్ చేశారు. ఆదివారం సింహాచలంలో నిర్వసితులు ధర్నా నిర్వహించారు. పంచగ్రామాల సమస్య హైకోర్టులో కేసు ఉందన్న కారణంతో ప్రభుత్వాలు ఏళ్ల తరబడి సమస్యను పరిష్కరించడంలేదన్నారు. గూగుల్ డేటా సెంటర్, ఐటీ కంపెనీల కోసం వందల ఎకరాల దేవస్థానం భూములను కట్టబెడుతున్నారని, పంచ గ్రామాల భూ సమస్యపై ప్రభుత్వం కనీసం చర్చించడం లేదని మండిపడ్డారు.
News November 30, 2025
రాజ్యాంగ రక్షణకు సైన్యం కావాలి: పరకాల ప్రభాకర్

భారత రాజ్యాంగం ప్రమాదంలో పడిందని దాన్ని కాపాడుకోవడానికి దళిత, బహుజన సైన్యం ఏర్పడాలని ప్రముఖ ఎకనామిస్ట్ పరకాల ప్రభాకర్ పిలుపునిచ్చారు. విశాఖలో అంబేద్కర్ భవన్లో ఆదివారం “భారతదేశ రాజకీయాలు- రాజ్యాంగ నైతికత సదస్సులో ఆయన మాట్లాడారు. దేశ రాజధానిలో ఊర కుక్కలపై ఉన్న స్పందన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై చెప్పుతో దాడికి స్పందన రాకపోవటం విచారకరమన్నారు. రాజ్యాంగం దృష్టిలో అందరూ సమానమేనన్నారు.


