News December 28, 2024
విశాఖ: ‘మరింత సమర్థవంతంగా పనిచేయాలి’
పోలీస్ అధికారులు మరింత సమర్థవంతంగా పనిచేస్తూ ముందుకు వెళ్లాలని విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ సూచించారు. వుడా చిల్డ్రన్ ఎరీనాలో శనివారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి గిరిధర్, నేవీ అధికారులతో కలిసి నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. వచ్చే ఏడాది చేపట్టాల్సిన కార్యక్రమాలను వివరించారు. గిరిధర్ మాట్లాడుతూ విధి నిర్వహణలో పోలీస్ శాఖకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు.
Similar News
News January 22, 2025
విశాఖ: రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి
అగనంపూడి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఇద్దరు భార్యాభర్తలని పోలీసులు తెలిపారు. ఫార్మాసిటీలో విధులు నిర్వహిస్తున్న మన్మధరావు తన భార్య అరుణ్ కుమారీతో కలిసి అగనంపూడి వద్ద డొంకాడ గ్రామంలో అద్దెకు ఉంటున్నట్లు సీఐ వివరాలు వెల్లడించారు. బ్యాంకు పనినిమిత్తం బైక్పై వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని, వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారని సీఐ తెలిపారు.
News January 22, 2025
అల్లూరి: బడి కోసం ఊరంతా ఏకమైంది..!
చింతపల్లి మండలం బలపం పంచాయతీ వీరవరంలో పాఠశాల భవనం నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు. గ్రామంలో పాఠశాల భవనం లేక బడి ఈడు పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గ్రామస్థులంతా ఏకమై శ్రమదానంతో రేకుల షెడ్డు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. విద్యాశాఖా మంత్రి లోకేశ్, అధికారులు వెంటనే స్పందించి గ్రామంలో పాఠశాల భవనం నిర్మించాలని కోరారు.
News January 22, 2025
అగనంపూడి వద్ద యాక్సిడెంట్.. ఇద్దరు మృతి
అగనంపూడి టోల్ గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం ఉదయం గాజువాక నుంచి అగనంపూడి వైపు బైక్పై వెళ్తున్న ఇద్దరు లారీ వెనుక చక్రాల కింద పడి స్పాట్లోనే మృతి చెందారు. మృతి చెందిన వారిలో ఒక మహిళ, మరో పురుషుడు ఉన్నారు. మృతి చెందిన మహిళ వద్ద ఉన్న ఆధార్ కార్డు, బ్యాంకు బుక్ ప్రకారం పాత గాజువాకకు చెందిన గొర్లె అరుణ్ కుమారిగా పోలీసులు గుర్తించారు. యువకుడి వివరాలు తెలియాల్సి ఉంది.