News March 29, 2024

విశాఖ: మరికొన్ని వర్గాలకు పోస్టల్ బ్యాలెట్

image

ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు, సర్వీస్‌ ఓటర్లతోపాటు మరికొన్ని వర్గాలకు ఈసారి పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకునే అవకాశం కల్పించనున్నారు. ప్రధానంగా 80 ఏళ్లు దాటిన వారిని, దివ్యాంగులను (40 శాతానికి పైబడి వైకల్యం కలిగిన), విధి నిర్వహణలో ఉండే జర్నలిస్టులను పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకునేవారి జాబితాలో చేర్చారు. దీంతో జిల్లాలో 30 వేల మందికి పైబడి పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకునే అవకాశం ఉంది.

Similar News

News January 7, 2026

విశాఖ: పరువు నష్టం దావా.. ఈనెల 21కి కేసు వాయిదా

image

తనపై ఓ పత్రిక ప్రచురించిన అసత్య కథనంపై పరువునష్టం దావా కేసులో భాగంగా మంత్రి నారా లోకేశ్ నేడు విశాఖ కోర్టుకు హాజరయ్యారు. మూడోసారి క్రాస్ ఎగ్జామినేషన్‌కు ఉదయం 11 గంటలకు కోర్టుకు రాగా.. మధ్యాహ్నం 3 గంటల వరకు కేసుకు సంబంధించి వాదనలు జరిగాయి. చివరకు న్యాయమూర్తి ఈనెల 21కి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు.

News January 7, 2026

రైల్వే జోన్ ఉద్యోగుల కేటాయింపుపై ముమ్మరంగా చర్యలు

image

సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏర్పాటులో కేంద్రం ముందడుగు వేసింది. రైల్వే జోన్ కార్యాలయ ఉద్యోగుల కేటాయింపు కోసం ముమ్మరంగా చర్యలు జరుగుతున్నాయి. 959 ఉద్యోగులను సౌత్ కోస్టల్ రైల్వే జోన్‌లో పని చేసేందుకు బదలాయింపు చేయాలని సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం శ్రీవాత్సవ, సౌత్ కోస్టల్ రైల్వే జీఎం సందీప్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. భోగాపురం ఎయిర్ పోర్టు ట్రయల్ రన్ తర్వాత ఉత్తరాంధ్రకు మరో గుడ్ న్యూస్‌గా చెప్పొచ్చు.

News January 7, 2026

బెంగుళూరు ట్రైన్ ఎక్కి మిస్ అయిన విశాఖ వాసి

image

తెన్నేటి నగర్‌కు చెందిన సిమ్మ శ్రీను బాబు (48) వృత్తి రీత్యా బెంగళూరులో పని చేస్తున్నారు. డిసెంబర్ 16న ప్రశాంతి ఎక్స్ ప్రెస్ ఎక్కి విశాఖకు బయలుదేరారు. అయితే మరుసటి రోజు అతను విశాఖ చేరుకోలేదు. తెలిసిన వారందరికీ అడిగినప్పటికీ ఆచూకీ దొరకకపోవడంతో కుటుంబ సభ్యులు కంచరపాలెం పోలీసులు, బెంగళూరు పోలీస్ స్టేషన్‌‌లో ఫిర్యాదు చేశారు. బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలన్నారు.