News December 13, 2024
విశాఖ: మహిళలతో వ్యభిచారం చేయిస్తున్న ముగ్గురు అరెస్ట్
మహిళలతో వ్యభిచారం చేయిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు రెండో పట్టణ పోలీసులు గురువారం తెలిపారు. పెందుర్తికి చెందిన జయ గంగాధర కృష్ణ, కే రత్నం, కప్పరాడకు చెందిన శ్యామ్ సుందరరావు యువతలు ఫోటోలను దీపక్కు అందజేసేవారు. దీపక్ ఫోటోలను వెబ్ సైట్లో పెట్టి ఆ యువతులతో వ్యభిచారం చేయించేవాడు. ఇటీవల దీపక్ను అరెస్ట్ చేయగా అతనిచ్చిన సమాచారం మేరకు ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు సీఐ తిరుమలరావు తెలిపారు.
Similar News
News January 21, 2025
ఆ ముఠాలో పెద్ద తలకాయలు ఉన్నాయి: విశాఖ సీపీ
క్రికెట్ బెట్టింగ్ ముఠాలో ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు విశాఖ సీపీ డా. శంఖబ్రత బాగ్చీ తెలిపారు. మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొన్ని విషయాలను పబ్లిక్గా చెప్పలేమన్నారు. ఇందులో పెద్ద తలకాయలు ఉన్నాయని వాళ్లను కచ్చితంగా పట్టుకుంటామన్నారు. ఇదే కేసులో ఓ హెడ్ కానిస్టేబుల్ని సస్పెండ్ చేసి ఎంక్వైరీకి ఆదేశించామన్నారు.
News January 21, 2025
అల్లూరి విగ్రహానికి నల్లరంగు..!
విశాఖలోని స్వతంత్ర నగర్ పార్కులో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి గుర్తుతెలియని వ్యక్తులు నల్లరంగు పూశారు. సీపీఐ మధురవాడ కార్యదర్శి వాండ్రాసి సత్యనారాయణ పీఎంపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై సీఐ స్పందించి విచారణ చేయాలని సిబ్బందికి ఆదేశించారు. కానిస్టేబుల్ లోవరాజు అల్లూరి విగ్రహాన్ని మంగళవారం పరిశీలించారు. సీసీ కెమెరాలను పరిశీలించి నిందితులను గుర్తిస్తామని తెలిపారు.
News January 21, 2025
స్టీల్ ప్లాంట్ను కాపాడింది చంద్రబాబే: మంత్రి కొల్లు
విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడింది చంద్రబాబే అని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మంగళవారం విశాఖ టీడీపీ కార్యాలయంలో మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ వల్లే ఈ రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో కేవలం భూదోపిడి కోసమే స్టీల్ ప్లాంట్ వ్యవహారాన్ని నడిపారని విమర్శించారు. విశాఖ రైల్వే జోన్కు ప్రధానితో శంకుస్థాపన చేయించడం జరిగిందన్నారు.